సరళమైన, సహజమైన, ఇంకా- మూర్ఖుడై•న మానవుడిని సైతం అసాధారణ, దైవికవ్యక్తిగా మార్చగల సామర్థ్యం భగవద్గీతకు ఉంది. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ పురాణభాగంలో నేటి జీవితానికి సంబంధించిన జ్ఞానం ఉంది. కృష్ణార్జునల మధ్య సంగ్రామభూమిలో జరిగిన తాత్త్విక సంభాషణకు శ్లోక రూపమిది. అయినా, 1890లలో ప్రారంభమైన ఆధునిక పర్యావరణశాస్త్రం లేదా పర్యావరణశాస్త్రాలు చెప్పే విషయాలు ఇందులో ఉన్నాయి.

దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ 11

మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుషుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు/సౌభాగ్యం కలుగుతుంది.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః 14

సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి. వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞాలు చేయటం వలన వానలు కురుస్తాయి. నిర్దేశించిన కర్తవ్యాల (విహితకర్మలు) ఆచరణ చేత యజ్ఞం జనిస్తుంది.

శాస్త్రీయ వ్యాఖ్య

యజ్ఞం (సంస్కృతం: •తీ ‘‘ఆరాధన, ప్రార్థన, సమర్పణ, నైవేద్యం, అగ్ని వేడుక’’) అనేది పురాతన కాలం నుండి వస్తున్న హిందూ ఆచారం. దీనిలో మనిషి దేవతల మధ్య అగ్నిదేవుడు మాధ్యమంగా పనిచేస్తాడు. యజ్ఞం అగ్ని ముందు నిర్వహిస్తారు. రుషులు వేదమంత్రాలను జపిస్తారు. మానవులు భూమిపై తమ శ్రేయస్సును, మరణం తరువాత స్వర్గానికి సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించగల సాధనమే యజ్ఞం. వేద ప్రపంచంలో వైవాహిక విభేదాల నుండి పాము కాటు వరకు అన్ని మానవ సమస్యలకు యజ్ఞం రామబాణంగా ఉండేది. గీత ప్రకారం, యజ్ఞం అంటే ఒక ఆత్మను పరమాత్మలో కలవడం. యజ్ఞాన్నీ కేంద్ర బిందువు కలుషిత వాతావరణాన్ని నయం చేయడం. తద్వారా ఇది మానవులకు మేలు చేస్తుంది. యజ్ఞమే మొత్తం విశ్వాన్ని కలిపి ఉంచుతుందని రుగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదాలు చెబుతున్నాయి. యజ్ఞం లోతైన సార్వత్రిక ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. మొత్తం విశ్వమే యజ్ఞాలతో మెరుగు పడుతుంది. యజ్ఞంలో పాల్గొనే శిష్యులు కూడా గురుకృప ద్వారా యజ్ఞ ప్రయోజనం పొందుతారు.

 పర్యావరణ కాలుష్యాన్ని పరిష్కరించడానికి యజ్ఞం ఉత్తమమార్గంగా ఛాందోగ్యోపనిషత్తు వర్ణించింది. యజ్ఞం మలినాలను తొలగిస్తుందనీ, కాలుష్యాన్ని నివారిస్తుందని, పర్యావరణాన్ని స్వచ్ఛపరుస్తుందని చెబుతారు. నెయ్యి, చక్కెర మిశ్రమాన్ని దగ్ధం చేయడం ఉత్పన్నమయ్యే పొగ కొన్ని వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములను చంపుతుందని ప్రయోగాలు నిరూపించాయి. ఈ ఆవిరులు వాతావరణాన్ని శుద్ధి చేయగలవని, మేఘాలు ఏర్పడటానికి సహాయపడతాయని, క్లౌడ్‌ ‌కండెన్సేషన్‌ ‌నూక్లియ్యే Cloud Condensation Nuclei] (CNNs) గా పనిచేయడం ద్వారా మంచి వర్షపాతాన్ని కలిగిస్తాయని కనుగొన్నారు. అందువల్ల యజ్ఞాలు నీటి చక్రాన్ని గణనీయంగా ప్రభావితం చేసి వర్షాన్నిస్తాయి. కలప, హవన-సామగ్రి సరైన ఎంపిక ద్వారా వివిధ శారీరక మానసిక వ్యాధులు, మానసిక రుగ్మతలకు నివారణగా కూడా యజ్ఞాన్ని ఉపయోగించవచ్చు. యజ్ఞం సాంకేతికత ద్వారా ఒకరి ఆలోచనలు, మాటలు చర్యలను మార్చగలరని, తద్వారా అతని లేదా ఆమె జీవితంలోని అన్ని అంశాలను ఆధ్యాత్మికం చేయగలరని కూడా నమ్ముతారు.

విజ్ఞానశాస్త్రంలో, జీవావరణ శాస్త్రం [Ecology] (గ్రీకు ‘ఒయికోస్‌’ అం‌టే ఇల్లు ; ‘లోగోస్‌’ అం‌టే నేర్చుకోవడం) అనేది జీవులు వాటి చుట్టూ ఉన్న పర్యావరణంతో ఎలా సంఘర్షిస్తాయన్న అంశం గురించిన అధ్యయనం. మరో మాటలో చెప్పాలంటే, జనాభాల జీవితాల గురించి తెలుసుకోవడం పర్యావరణ శాస్త్రంగా మారుతుంది. ఒక పర్యావరణ శాస్త్రవేత్త జీవులు, వాటి ఆవాసాలు/నివాస స్థలాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తారు. జీవావరణ శాస్త్రం, బయోనామిక్స్, ‌లేదా పర్యావరణ జీవశాస్త్రం అనేవి జీవావరణ శాస్త్రానికి పర్యాయపదాలు. పర్యావరణ శాస్త్రం ఒక కొత్త శాస్త్రం, జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన శాఖగా పరిగణిస్తారు. ఇది 20వ శతాబ్దం రెండవ భాగంలో ప్రాముఖ్యంలోకి వచ్చింది. 1890లలో అమెరికన్‌ ‌వృక్షశాస్త్రజ్ఞుల బృందంతో పర్యావరణ శాస్త్రం ప్రారంభమైంది. అనుసరణ, సహజ ఎంపికకు సంబంధించిన పరిణామాత్మక భావనలు ఆధునిక పర్యావరణ సిద్ధాంతానికి మూలస్తంభాలు. పర్యావరణశాస్త్రం ఆహార ఉత్పత్తికి, స్వచ్ఛమైన గాలి, నీటిని నిర్వహించడానికీ మారుతున్న వాతావరణంలో ప్రజలు ప్రకృతి మధ్య పరస్పర ఆధారపడటం, జీవవైవిధ్యాన్ని కొనసాగించడం గురించి ముఖ్యమైన జ్ఞానాన్ని అందిస్తుంది. జీవుల యొక్క జీవ, అజీవ కారకాల పంపిణీని పర్యావరణంపై వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం జీవావరణశాస్త్ర ప్రధాన లక్ష్యం.

పారిశ్రామిక విప్లవం 1760-1840 మధ్య కాలంలో విస్తరించిందని, అదే సమయంలో జీవావరణ శాస్త్రం, పర్యావరణ సమస్యలపై దృష్టి 1890లలో ప్రారంభమైందని గమనించాలి. పెరుగుతున్న జనాభా అవసరాలు పర్యావరణం మానవులపై దాని ప్రభావాన్ని నిర్లక్ష్యం చేస్తూ సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాయి. మనిషి కోసం పెరిగిపోతున్న ఈ సౌకర్యాల అన్వేషణ పర్యావరణ కాలుష్యానికి దారితీసింది. మానవులతో సంబంధం ఉన్న జీవ, అజీవ కారకాలపై ప్రభావం చూపింది.

ఆధునిక కాలంలో, ఆస్తికులు యజ్ఞాలు లేదా యాగాలు వర్షాన్ని ఉత్పత్తి చేస్తాయని నిరూపించాలను కుంటున్నారు. యజ్ఞాలు విషవాయువులను ఉత్పత్తి చేస్తాయని, పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తాయని నిరూపించడానికి నాస్తికులు కృషి చేస్తున్నారు. సహజ వనరులను విచక్షణారహితంగా దోపిడీ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తగ్గిన వర్షపాతం, ప్రపంచ వ్యాప్తంగా ఊహించని కరవులు/వరదలకు మూల కారణం. దేవుళ్లను సంతోషపెట్టడానికి యజ్ఞాలు అని పిలుస్తున్న తంతును నిర్వహిస్తే సరిపోదు. వర్షాలకు అటవీ విస్తీర్ణం నిరంతర నీటి చక్రం వంటి ముందస్తు అవసరాలు కూడా చాలా అవసరం. ఈ కారకాలు లేకుండా, యజ్ఞాలు నిరుపయోగమవుతాయి. మహాభారత కాలంలో పర్యావరణ శాస్త్రాల వాటి ప్రాముఖ్యంను బాగా అర్థం చేసుకున్నారని, కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు గీత ద్వారా అర్జునుడికి చెప్పిన సత్యాలలో దీనిని కీలకంగా భావించాడని గమనించాలి.

డాక్టర్‌ ‌చీనేపల్లి రవిశంకర

శాస్త్రవేత్త-ణ (రిటైర్డ్)

‌సెంట్రల్‌ ‌సిల్క్ ‌బోర్డ్, ‌బెంగళూరు

About Author

By editor

Twitter
YOUTUBE