ఈ సవరణను తిరస్కరించడం ద్వారా, ప్రతిపక్షం కేవలం ఒక శాసన నిబంధనను అడ్డుకోవడమే కాకుండా, భారత మహిళల రాజకీయ భవిష్యత్తుపై వాస్తవంగా స్టే ఆర్డర్ జారీ చేసింది. తద్వారా, వారు కోరుకోని, అర్హత లేని ఒక దశాబ్దం పాటు నిరీక్షణలోకి వారిని నెట్టివేసింది. నారీ శక్తి వందన అధినియమ్ను అమలు అంచున నిలిపివేయడం ద్వారా, ప్రతిపక్షం తన రాజకీయ పరాజయాన్ని తానే సృష్టించుకుంది. వారి వ్యూహాత్మక తప్పిదాలు, అంతర్గత వైరుధ్యాలు ఏకమై, దేశంలోని అత్యంత నిర్ణయాత్మక ఓటర్ల వర్గాన్ని దూరం చేసిన తరుణం ఇది.
ఏప్రిల్ 17, 2026న లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విఫలమవడం, భారత ప్రజాస్వామ్య ప్రస్థాన చరిత్రలో ఒక ఘోర ద్రోహ దినంగా చిరకాలం నిలిచిపోతుంది. ఇండి అలయన్స్ ముఖంపై ఉన్న ప్రగతిశీల ప్రసంగాల ముసుగు చివరకు తొలగిపోయి, దాని తిరోగమన నిరోధక వైఖరి, సంకుచిత రాజకీయ మనుగడవాదం బయటపడిన క్షణం ఇది. 2029 ఎన్నికల నాటికి మహిళలకు సంస్థాగత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగుగా ఉద్దేశించిన దానిని, ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. ఈ సవరణను తిరస్కరించడం ద్వారా, ప్రతిపక్షం కేవలం ఒక శాసన నిబంధనను నిరోధించడమే కాకుండా, భారత మహిళల రాజకీయ భవిష్యత్తుపై వాస్తవంగా స్టే ఆర్డర్ జారీ చేసింది. తద్వారా, వారు కోరుకోని, అర్హత లేని ఒక దశాబ్దం పాటు నిరీక్షణలోకి వారిని నెట్టి వేసింది. నారీ శక్తి వందన అధినియమ్ను అమలు ప్రారంభ దశలోనే నిలిపివేయడం ద్వారా, ప్రతిపక్షం తన రాజకీయ పరాజయాన్ని తానే కొనితెచ్చుకుంది. వారి వ్యూహాత్మక తప్పిదాలు, అంతర్గత వైరుధ్యాలు ఏకమై, దేశంలోని అత్యంత నిర్ణయాత్మక ఓటర్ల వర్గాన్ని దూరం చేసిన తరుణం ఇది.
మహా ద్రోహం: ఒక దశాబ్దపు నిరాకరణ
2023 నాటి శాసనపరమైన ఉద్దేశానికి, 2029 నాటి వాస్తవ ఆచరణకు మధ్య ఉన్న కాలవ్యవధిని పూడ్చగలగడమే 131వ సవరణ ప్రాముఖ్యత.
అసలు నారీ శక్తి వందన అధినియమ్ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించబడినప్పటికీ, దాని అమలు మాత్రం జనాభా లెక్కల అనంతర నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపడిపోయింది. ఆ క్షణం ఆవశ్యకతను, భారత మహిళల ఆకాశా న్నంటు తున్న ఆకాంక్షలనుగుర్తించి, ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి పూనుకుంది. తద్వారా, రాబోయే లోక్సభలో 33 శాతం రిజర్వేషన్ వాస్తవ రూపం దాల్చేలా చూసింది. ఈ సవరణకు వ్యతిరే కంగా ఓటు వేయడం ద్వారా, మరో పదేళ్లపాటు పార్లమెంట్ ద్వారాలు మహిళలకు మÖసివేసేలా ఇండీ కూటమి నిర్థారించింది. ఇప్పుడు దీని అమలు 2034కు వాయిదా పడింది. ఈ సుదూర భవిష్యత్తు, మహిళా నాయకుల తరం మొత్తానికి రాజకీయ బహిష్కరణ శిక్షలా అనిపిస్తోంది.
ఇది కేవలం ఒక విధానపరమైన జాప్యం మాత్రమే కాదు; ఇది స్వీయ నిర్ణయాధికారాన్ని చురుకుగా నిరాకరించడమే. 2023 చట్టంలో తక్షణ సాధికారత వాగ్దానాన్ని చూసిన లక్షలాది మంది మహిళలకు, ఈ విధ్వంసం ఒక చేదు నిజాన్ని గుర్తు చేస్తుంది. అదేమిటంటే, కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం అనేది ఒక జీరో-సమ్ గేమ్ (ఒకరి లాభం మరొకరి నష్టం) గానే మిగిలిపోతుంది. ఇందులో మహిళల భాగస్వామ్యం అనేది పాతుకుపోయిన పితృస్వామ్యానికి, వంశపారంపర్య వ్యవస్థలకు ఒక ముప్పుగా పరిగణనకు నోచుకుంటుంది. తమ సంప్రదాయ అధికార పీఠాలకు భంగం కలుగు తుందనే భయంతో ఉన్న ఇండీ కూటమి వ్యూహాత్మక ఆందోళనల ముందు, మహిళల ప్రాతినిధ్యం అనేది ఒక ద్వితీయ ప్రాధాన్యత గల అంశమని ప్రతిపక్షం భారత మహిళలకు స్పష్టంగా చెప్పింది.
విభజన భూతం: ఒక తప్పుడు కథన విశ్లేషణ
ఈ ద్రోహాన్ని సమర్థించుకోవడానికి ప్రతిపక్షాలు ఉపయోగించిన ప్రధాన అస్త్రం, ఉత్తర-దక్షిణ అసమ తుల్యత గురించి సృష్టించిన భయమే. వ్యూహాత్మక కచ్చితత్వంతో విస్తరింపజేసిన ఈ కథనం, 131వ రాజ్యాంగ సవరణను ప్రాంతీయ అణచి వేతకు ఒక సాధనంగా చిత్రీకరించడానికి ప్రయత్నిం చింది. అయితే, ప్రతిపాదిత 816-సీట్ల లోక్సభ గణాంక వాస్తవికతను నిశితంగా పరిశీలిస్తే, ఈ ప్రచారం నిశ్చయంగా బట్టబయలవుతుంది. ప్రభుత్వ ప్రతి పాదన ఏ ప్రాంత ప్రాతినిధ్యాన్ని తగ్గించడం గురించి ఎన్నడూ కాదు; అది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజాస్వామ్య అవకాశాలను విస్తరిం చడం, ఏ రాష్ట్రం తన సాపేక్ష ప్రాధాన్యతను కోల్పో కుండా చూడటం గురించే. 816-సీట్ల నమÖనా ప్రకారం, దక్షిణ రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొత్తం సీట్ల సంఖ్య ప్రస్తుత 129 నుండి 195కి పెరిగి ఉండేది. ఇది సంపూర్ణ లాభం, జాతీయ శాసనసభలో దక్షిణాది గొంతును బలోపేతం చేసే ఒక గణనీయమైన విస్తరణ. అయినప్పటికీ, ప్రతిపక్షం ఈ గణాంకాలను విస్మరించి, మహిళా సాధికారతను అడ్డుకోవడానికి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడానికే మొగ్గు చూపింది. మొత్తం సభలో దక్షిణ రాష్ట్రాల వాటా స్థిరంగానే ఉండేదని పరిగణనలోకి తీసుకుంటే, ఆ రాష్ట్రాలు నష్టపోతాయన్న వారి వాదన ఒక డొల్ల కల్పన. అందువల్ల, మిగిలింది ఒక చట్టబద్ధమైన నిర్మాణాత్మక ఆందోళన కాదు, ప్రాంతీయ అధిపతుల యథాతథ స్థితిని సవాలు చేయగల కొత్త, స్వతంత్ర మహిళా నాయకుల వర్గం ఆవిర్భవించకుండా నిరోధించడానికి రూపొందించిన రాజకీయ ప్రేరేపిత దిగ్బంధనం మాత్రమే. ప్రాంతీయ గుర్తింపును లింగ న్యాయానికి వ్యతిరేకంగా నిలబెట్టడం ద్వారా, ఇండీ కూటమి రెండింటిలోనూ విఫలమైంది.
2029లో ఎన్నికల ఆధిపత్యం కోసం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల పునర్విభజనను ఒక ఊతకర్రగా వాడుకుంటోందన్నది ప్రతిపక్షాల వాదనలో మరో కోణం. ఈ ఆరోపణ ఎంత నిస్సహాయమైనదో, వాస్తవానికి అంత దూరమైనది.
2024 లోక్సభ ఎన్నికల తర్వాత భారత్ రాజకీయ ప్రస్థానం నిరూపించింది ఏమిటంటే, బీజేపీ బలం నియోజకవర్గాల పటాన్ని తిరిగి గీయడంలో కాకుండా అది సంస్థాగత పటిష్టత. సైద్ధాంతిక స్పష్టతలో పాతుకుపోయి ఉందని. 2024 ఫలితాలు స్థానిక నిర్లక్ష్యం కారణంగా వ్యూహాత్మకంగా వెనుకబడిన ఫలితమే అయినా, ఆ తర్వాత మహారాష్ట్ర, బిహార్, హరియాణా, ఢిల్లీలలో సాధించిన నిర్ణయాత్మక విజయాలు పార్టీ పునాది నిర్మాణాత్మ కంగా చెక్కుచెదరకుండా ఉందని, వేగంగా సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం ఉందని నిరూపించాయి.
ప్రస్తుత పరిమితులతోనే రాష్ట్రాల తర్వాత రాష్ట్రాలను కైవసం చేసుకోగల పార్టీకి విజయం సాధించడానికి కొత్త పటం అవసరం లేదు. 131వ సవరణ కోసం జరిగిన ఒత్తిడికి కారణం నారీ శక్తి పట్ల ఉన్న నాగరికతా నిబద్ధతే తప్ప, ఎన్నికల్లో విజయానికి అడ్డదారుల అన్వేషణ కాదు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షం బీజేపీకి ఆటంకం కలిగించలేదు; అది కేవలం భారత మహిళలకు మాత్రమే ఆటంకం కలిగించింది. అది ఒక పరివర్త నాత్మక జాతీయ సంస్కరణను ఒక పక్షపాత ఎత్తుగడగా పొరబడింది. అలా చేయడం ద్వారా, దృఢమైన మహిళా ఓటర్లు కుల, ప్రాంతీయ హద్దులను దాటి చైతన్యవంతమైన, సాంప్రదాయ ఓటు బ్యాంకుల స్థానంలోకి వస్తుండటంతో మారుతున్న రాజకీయ వాతావరణం పట్ల తనకున్న భయాన్ని బయటపెట్టుకుంది.
చారిత్రక కపటత్వం-అడ్డంకుల నైజం
ఈ తాజా ద్రోహాన్ని అర్థం చేసుకోవాలంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘ చరిత్రను పరిశీలిం చాలి. ప్రస్తుతం ఇండీ కూటమిలో కీలకంగా ఉన్న పార్టీలే ఈ బిల్లును దశాబ్దాలుగా బందీగా ఉంచాయి. 1990ల చివరలో సభ మధ్యలో బిల్లును చించి వేయడం నుండి యÖపీఏ హయాంలోని వ్యూహాత్మక జాప్యాల వరకు, మహిళా నాయకత్వం పట్ల వ్యతిరేకత ప్రతిపక్ష నైజంలో ఒక స్థిరమైన పోకడగా ఉంది. నేటి తేడా ఏమిటంటే, మద్దతు అనే ముసుగు మరింత పలుచబడింది.
2023లో, ప్రజా ఒత్తిడి అధికంగా ఉండటంతో వారు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. 2026లో, జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజనలోని సాంకేతిక అంశాల వెనుక దాక్కో వచ్చని భావించి, దాని అమలును అడ్డుకున్నారు. సంక్షేమ పథకాలకు మహిళలను ఒక ప్రయోగశాలగా చూస్తూ, వారిని పరిపాలనలో భాగస్వాములుగా ఎన్నడూ పరిగణించని రాజకీయ వర్గానికి ఇది ఒక ప్రత్యేక లక్షణం. మహిళలు లబ్ధిదారులుగా ఉండటంతో వారు సౌకర్యంగా ఉంటారు. కానీ అదే మహిళలు నిర్ణయాలు తీసుకునేవారిగా ఉండటాన్ని చూసి భయపడతారు. 131వ సవరణ వారి చిత్తశుద్ధికి ఒక గీటురాయిగా నిలిచింది. కానీ వారు అందులో ఘోరంగా విఫలమయ్యారు. 2034 వరకు 33 శాతం కోటాను కేవలం కాగితపు వాగ్దానంగానే ఉంచడం ద్వారా, లింగ సమానత్వం పట్ల తమ నిబద్ధత అనేది, తమ అంతర్గత అధికార సమీకరణా లతో విభేదించినప్పుడు సులభంగా పక్కన పెట్టే ఒక ఎన్నికల ప్రదర్శన తప్ప మరేమీ కాదని వారు నిరూపించుకున్నారు.
నిర్ణయాధికార శక్తి ఆవిర్భావం
2024లో తగ్గిన మెజారిటీలు బీజేపీ కార్యకర్త లకు ఒక కీలకమైన గుణపాఠంగా నిలిచాయి. సులభ తరం చేసే ధోరణిలోని ప్రమాదాలను, నిరంతర క్షేత్రస్థాయి భాగస్వామ్యం ఆవశ్యకతను ఇది స్పష్టం చేసింది. అయితే, ప్రతిపక్షాలు దీనిని పార్టీ పతనానికి సంకేతంగా తప్పుగా అర్థం చేసుకున్నాయి. భారతీయ ఓటరు, ముఖ్యంగా మహిళా ఓటరు, ఇకపై కేవలం సందేశాలను నిష్క్రియంగా స్వీకరించే వ్యక్తి కాదని, ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకైన భాగస్వామి అని గ్రహించడంలో వారు విఫల మయ్యారు. ప్రస్తుతం ఓటర్లలో మహిళలు దాదాపు 49 శాతం ఉన్నారు. అనేక కీలక రాష్ట్రాలలో వారి ఓటింగ్ శాతం పురుషుల కంటే నిలకడగా ఎక్కువగా ఉంది. ఇదే నిర్ణయాధికార శక్తి, ప్రభుత్వాల మనుగడను నిర్ధారించే కీలకమైన అంశం. ఈ జనాభా వర్గం, స్పష్టమైన ప్రయోజనాలకు స్పందించి నంతగానే, సమ్మిళిత రాజకీయాలకు, ప్రతీకాత్మక గుర్తింపునకు కూడా స్పందిస్తుంది. మరో దశాబ్దం పాటు పార్ల మెంటులోకి మహిళల ప్రవేశాన్ని సమర్థవంతంగా నిలిపివేయడం ద్వారా, ఇండీ కూటమి వ్యూహాత్మక ఆత్మహత్య చేసుకుంది. 2029 నాటికి మీకు మీ హక్కులను ఇవ్వడానికి మేము ప్రయత్నించాము, కానీ వారు దానిని అడ్డుకున్నారు అనే ఒక శక్తివంతమైన నైతిక కథనాన్ని అధికార పక్షానికి అందించింది. ప్రజల దృష్టిలో జన గణన కాలపట్టికలు, నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ల సంక్లిష్టతలు తొలగిపోయి, అడ్డంకులకు, సాధికారతకు మధ్య ఉన్న సరళమైన, సూటియైన సత్యం బయటపడింది.
డిజిటల్ అవగాహన – అడ్డుగోడలు ధ్వంసం
ఆధునిక మహిళా ఓటరును తీర్చిదిద్దడంలో డిజిటల్ కనెక్టివిటీ పాత్రను ప్రతిపక్షం కూడా తక్కువ అంచనా వేస్తోంది. గత దశాబ్దాలలో, జాతీయ రాజధానిలోని రాజకీయ ఎత్తుగడలు ప్రాంతీయ మీడియా వల్ల మరుగున పడిపోయేవి లేదా విధానపరమైన పరిభాషలో కూరుకుపోయేవి. నేడు, బిహార్లోని మారుమÖల గ్రామంలో గానీ లేదా బెంగళూరులోని ఒక వృత్తి కేంద్రంలో గానీ స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి మహిళకు శాసనపరమైన అడ్డంకుల గురించి తెలుసు. నారీ శక్తి నినాదం కేవలం పైనుంచి వచ్చే నినాదం మాత్రమే కాదు; అది ఒక జీవన ఆకాంక్ష. 131వ రాజ్యాంగ సవరణ ఓడిపోయి నప్పుడు, ఆ వార్త కేవలం రాజకీయ ఉన్నత వర్గాలకే చేరలేదు. అది స్వయం సహాయక బృందాలకు, స్థానిక పారిశ్రామికవేత్తలకు, 2029లో తమ ప్రయోజనా లకు మహిళలు ప్రాతినిధ్యం వహించడాన్ని చూడాలని ఎదురుచూస్తున్న తొలిసారి ఓటు వేస్తున్న ఓటర్లకు కూడా చేరింది. పార్లమెంటుకు అడ్డుగోడలు కట్టాలనే ప్రతిపక్ష ప్రయత్నం, వారు ప్రసన్నం చేసుకోవాలను కుంటున్న ప్రజలకే ప్రత్యక్షంగా ప్రసారం చేయడ మైంది. ఈ పారదర్శకత వల్ల, తమ మేనిఫెస్టోలలో మహిళా అనుకూలురమని చెప్పుకుంటూ, పార్లమెంటరీ ఓట్లలో మహిళా వ్యతిరేకులమని చెప్పుకునే ద్వంద్వ గుర్తింపును కొనసాగించడం ఇండీ కూటమికి అసాధ్యమైంది. దాని మాటలకూ, చేతలకూ మధ్య అంతరం పూడ్చలేని అగాధంగా మారింది. భారత్ మునుపెన్నడూ చూడని స్థాయిలో రాజకీయ చైతన్యంతో మహిళా ఓటర్లు దీనిని గమనిస్తున్నారు.
రాజకీయ కపటత్వానికి తగిన మూల్యం
ఈ సవరణ విఫలం కావడం ప్రతిపక్ష జవాబు దారీతనంపై ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దశాబ్దాలుగా, ఈ పార్టీలు ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్లను ఒక అనుకూలమైన నినాదంగా వాడుకుని, వాటి అమలు వాస్తవరూపం దాల్చగానే తెరమరుగులోకి వెళ్లిపోయాయి. 2023 ఏకాభిప్రాయం జాతీయ ఐక్యతకు ఒక అరుదైన క్షణం. కానీ 2029 నాటికి దానిని క్రియాశీలం చేయడానికి తదుపరి చర్య అవసరమైన తరుణంలో, ఆ ఐక్యత విధానపరమైన సాకుల మేఘంలో కలిసిపోయింది. ప్రాంతీయ భ్రమలు, వ్యూహాత్మక అడ్డంకుల బలిపీఠంపై మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎందుకు బలిచ్చారో భారత మహిళలకు వివరించాల్సిన కఠినమైన సవాలును ఇప్పుడు ఇండీ కూటమి ఎదుర్కొంటోంది. మహిళా ఓటర్లు ఈ సంఘటనను ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ న్యాయమైన వాటాను నిరాకరించడంగా భావిస్తే, ప్రతిపక్షానికి ఎన్నికల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. వారు తమను తాము ఒక అవగాహన శూన్యంలో బంధించుకున్నారు. అక్కడ వారు పాత, పురుషాధిక్య వ్యవస్థకు సంరక్షకులుగా కనిపిస్తున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి, ఆయన పార్టీ ఒక నూతన, సమ్మిళిత భారత్ విజేతలుగా పరిగణనలోకి వచ్చారు. ఇది కేవలం శాసనపరమైన వైఫల్యం మాత్రమే కాదు; ఇది ఒక నైతిక దివాలా, ఇది దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లో ప్రతిపక్షాన్ని వెంటాడుతుంది.
అపోహల ఉచ్చులో ప్రతిపక్షాలు
రాజకీయాల్లో, శాసనపరమైన వివరాల కంటే అపోహలే తరచుగా బలంగా ఉంటాయి. సీట్ల విస్తరణపై ప్రభుత్వం విడుదల చేసిన పారదర్శకమైన గణాంకాల ద్వారా వారి వాదనలు ఇప్పటికే బహిరంగంగా పటాపంచలు కావడంతో, ప్రతిపక్షాల సందిగ్ధత మరింత తీవ్రమైంది. సంఖ్యలు ఏమాత్రం సమర్థించని ప్రాంతీయ అసమతుల్యత గురించిన ఆందోళనలను ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా, వారు ఆకాంక్షలు, గణాంకాలపై అవగాహన ఉన్న ప్రజలను ఇకపై ఆకట్టుకోలేని ఒక కథనానికి తమను తాము బంధించుకున్నారు. అదే సమయంలో, నియోజకవర్గాల పునర్విభజన లేకుండా 2029 నాటికి మహిళా రిజర్వేషన్లకు వీలు కల్పించే ఎలాంటి స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని వారు ప్రదర్శించలేక పోవడం, వారి దూరదృష్టి లోపాన్ని బయటపెడు తోంది. వారు ‘కాదు’ అని చెప్పే పక్షంగా, అడ్డుకునే పక్షంగా, మార్పుకు భయపడే పక్షంగా కనిపిస్తున్నారు. దీనికి భిన్నంగా, అధికార పక్షం మహిళలు, రాష్ట్రాల ఆకాంక్షలకు అనుగుణంగా లోక్సభ స్వరూపాన్నే విస్తరించడానికి సుముఖతను ప్రదర్శించింది. పురోగతి కోసం ప్రయత్నించే పక్షమే నైతికంగా ఉన్నత స్థానాన్ని పొందుతుంది. దీనిని అడ్డుకునే పక్షం తన విశ్వసనీయతను, భవిష్యత్తును కోల్పోతుంది. ఇండీ కూటమికి 131వ సవరణ ఓటమి ఒక వ్యూహాత్మక విజయం కాదు; అది వారిని చరిత్రలో తప్పుడు పక్షాన నిలబెట్టిన ఒక వ్యూహాత్మక విపత్తు.
2034 తర్వాత.. విధ్వంసపు సుదీర్ఘ ఛాయ
2029, 2034 సంవత్సరాలకు దారి తీసే మార్గం ఇప్పుడు ఈ విధ్వంసకర క్షణంతోనే నిర్వచించబడుతుంది. బీజేపీ గెలవడానికి నియోజక వర్గాల పునర్విభజన అవసరమనే అపోహ, దాని సంస్థాగత పటిష్టత, ఎదురుదెబ్బల నుండి పాఠాలు నేర్చుకునే సామర్థ్యం వల్ల పూర్తిగా పటాపంచలైంది. ముందున్న అసలైన పోరాటం నియోజకవర్గాల సరిహద్దుల కోసం కాదు, సాధికారత అనే నినాదం కోసం జరుగుతుంది. ఇండీ కూటమి బీజేపీకి ఒక శక్తివంతమైన సైద్ధాంతిక ఆయుధాన్ని అందించింది, అది భారతదేశంలోని ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనిస్తుంది. మహిళా రిజర్వేషన్లను 2034 వరకు వాయిదా వేయడం అధికార పక్షానికి ఒక నినాదంగా, ప్రతిపక్షాల ద్రోహానికి నిరంతర గుర్తుగా మారుతుంది.
జాతీయ పురోగతి కంటే తమ మనుగడకే ఎక్కువ విలువనిచ్చే రాజకీయ వర్గం వల్ల తమ నాయకత్వ కలలు వాయిదా పడటాన్ని చూస్తున్న మహిళా ఓటర్ల నిశ్శబ్ద విప్లవాన్ని సమీకరించడానికి ఇది ఉపయోగించబడుతుంది.
దేశం తదుపరి ఎన్నికల చక్రం వైపు పయనిస్తున్న ప్పుడు, ఏప్రిల్ 17, 2026 జ్ఞాపకం మనసులో నిలిచిపోతుంది. నారీశక్తి యాత్రను అడ్డుకోవాలని ప్రతిపక్షం నిర్ణయించుకున్న రోజుగా ఇది గుర్తుండి పోతుంది, అలా చేయడం ద్వారా వారు తమ అంతిమ ఓటమిని ఖాయం చేసుకున్నారు. ఈ విధ్వంసం నీడ 2029 ఎన్నికలను దాటి చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఆధునిక, అభివృద్ధి చెందుతున్న భారత్ ఆకాంక్షలకు తామే ప్రతినిధు లమన్న ప్రతిపక్ష వాదనలపై చీకటిని కమ్మేలా చేస్తుంది.
– జాగృతి డెస్క్