అక్టోబర్ 14. భారత్ డేటా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. దేశ సాంకేతిక రంగంలో కొత్త పొద్దుపొడిచింది. ఆంధ్రప్రదేశ్లో నవశకానికి నాంది పలికింది. ఇదే రోజున ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఏఐ హబ్ను ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వంతో దేశరాజధానిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీవైష్ణవ్ ఈ చరిత్రాత్మక ఘటనకు సాక్షులుగా నిలిచారు. ఈ క్రమంలో డేటా ప్రపంచంతో, దానికి కీలకమైన డేటా సెంటర్లతో భారత్ సాంకేతిక ప్రస్థానం తీరుతెన్నులు ఇలా ఉన్నాయి.
డేటా సెంటర్లు(డీసీలు) ఆధునిక సాంకేతిక ప్రపంచంలో నిర్మాణ విభాగాలు. టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్లు (టెల్కోలు) హై-స్పీడ్ 4జీఎల్టీఈ ` నాల్గవ తరం దీర్ఘకాలిక పరిణామక్రమానికి మారడం త్వరలో 5జీ(ఐదవ తరం) వైర్లెస్ టెక్నాలజీలు భారతదేశంలో డేటా సెంటర్ మౌలిక సదుపాయా లకు డిమాండ్ను అందిస్తున్నాయి. కరోనా మహమ్మారి పీడ వదిలిన తర్వాత ఆన్లైన్ షాపింగ్, వీడియోకాల్స్, ఈ-క్లాసులు, మరిన్ని యాప్ల వాడకం, సినిమాలను ప్రసారం చేయడం – ఇవన్నీ డిజిటల్ డేటాను అద్భుతంగా ఉత్పత్తి చేశాయి. డీసీలకు, డిజిటల్ ప్రపంచంలోని గిడ్డంగులకు డిమాండ్ను పెంచాయి.కార్పొరేట్లు క్లౌడ్ కంప్యూటింగ్ను వేగవంతం చేయడం ద్వారా డిమాండ్ను మరింత పెంచాయి. ఇంతలో ప్రభుత్వం స్వదేశీని ప్రోత్స హిస్తున్నందున, కంపెనీలు డీసీలను ఏర్పాటు చేయడానికి తొందరపడుతున్నాయి. పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు డీసీ వ్యాపారాన్ని ఒక అద్భుతమైన విభాగంగా చూస్తున్నాయి. డీసీ ప్లేయర్లు ఆదాయపరంగా అనూహ్యంగా పెరుగుతుండటం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 నాటికి 175 జెట్టా బైట్లకు పైగా డేటా నిర్వహణలో భాగంగా డీసీలు సమాచారాన్ని తీసుకోవడం, గణన, నిల్వ చేయడం, నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి. భారతదేశం వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షిస్తూ, డీసీల నిర్వహణ విషయంలో అమెరికా తర్వాత స్థానంలో ఉంది.
ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కనిపించే డీసీలు ఇంటర్నెట్కు వెన్నెముకలా పనిచేస్తాయి. అవి మనం ప్రతిరోజూ ఉత్పత్తి చేసే సమాచారాన్ని నిల్వ చేస్తాయి, కమ్యూనికేట్ చేస్తాయి, రవాణా చేస్తాయి. మనం ఎంత ఎక్కువ డేటాను సృష్టిస్తామో, అంతే స్థాయిలో డీసీల ప్రాధాన్యత పెరుగుతూ పోతుంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలు డేటాను నిల్వ చేసే అతీంద్రియ ప్రదేశంగా పేరొందింది. అది డిజిటల్ యుగపు కార్ఖానాలైన వందలాది భారీ డీసీలలో భౌతికంగా తన ఉనికిని చాటుకుంటోంది. గాలి కూడా చొరబడటానికి లేకుండా, ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా కనిపించే భోషాణాల్లాంటి ఈ సెంటర్లు బెంగళూరు నుండి లాస్ వెగాస్ వరకు, నోయిడా నుండి రేక్జావిక్ (ఐస్ల్యాండ్కు రాజధాని) వరకు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. భూగోళంపైన డిజిటల్ సేవలను నడిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి నిర్మాణానికి ఏడాదికి 2 వేల కోట్లు డాలర్లు ఖర్చవుతుంది. సంస్థలు ఒకదానిపై మరొకటి పైచేయి సాధించడం కోసం డేటాపై ఆధార పడుతుంటాయి. ఇది డేటా నిల్వకు డిమాండ్ను పెంచుతోంది. దీని ఫలితంగా ప్రపంచ డీసీ మార్కెట్ నిరంతరం విస్తరిస్తోంది.
భారత్లో కీలకమైన డేటా సెంటర్ ఆపరేటర్లు
1.CtrlS:
CtrlS అనేది భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన డేటాసెంటర్ నిర్వహణా సేవల ప్రదాత. ఇది హైదరాబాద్, ముంబై, నోయిడా, బెంగళూరు సహా ఏడు అత్యాధునిక ఫెసిలిటీలలో మొత్తంగా 10 లక్షల చదరపు అడుగుల మేర డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. CtrlS ప్రకారం ఇది ఫార్చ్యూన్ 500 గ్లోబల్ బహుళజాతి సంస్థల్లో 60కి పైగా సంస్థలకు సేవలు అందిస్తోంది. ముంబై డేటాసెంటర్ ఫెసిలిటీ 1 మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్లతో కప్పి ఉంది. దీని నోయిడా సెటప్ 100% భూకంప నిరోధక, కాలుష్య రహిత డేటా సెంటర్ ఫెసిలిటీగా నిర్మితమైంది. CtrlS తన పాదముద్రను 50 లక్షల చదరపు అడుగులకు విస్తరించే ప్రణాళికపై పని చేయడం ప్రారంభించింది. ఇది నవీ ముంబైలో 20 లక్షల చదరపు అడుగుల హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ నిర్మించడానికి భూమిని కొనుగోలు చేసింది. హైదరాబాద్లో 20 లక్షల చదరపు అడుగుల హైపర్ స్కేల్ డేటాసెంటర్ పార్క్, చెన్నైలో 10 లక్షల చదరపు అడుగుల ఫెసిలిటీ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
2. ESDS
2005 లో స్థాపితమైన ESDS ఒక ప్రముఖ మేనేజ్డ్ డేటా సెంటర్ సర్వీస్, ఆటో-స్కేలబుల్ క్లౌడ్ సొల్యూషన్ ప్రొవైడర్గా వ్యవహరిస్తోంది. పెద్ద ఎత్తున వినియోగదారులను ఆకర్షించడానికి పటిష్టంగా పనిచేస్తోంది. ఇది సాంకేతిక మద్దతుతో మేనేజ్డ్ డేటా సెంటర్ సేవలు, మేనేజ్డ్ క్లౌడ్ సొల్యూషన్స్, వర్చువ లైజేషన్, డిజాస్టర్ రికవరీ హోస్టింగ్లను అంది స్తోంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చ రింగ్, విద్య, ఎనర్జీ, యుటిలిటీస్, హెల్త్కేర్, ఇ-కామర్స్, వ్యవసాయం, ఐటీ, వినోదం. మీడియా, టెలికాం, ప్రభుత్వం, ట్రావెల్, టూరిజం వంటి రంగాలలో తన ఉనికిని చాటుకుంటోంది.
3. GPX గ్లోబల్ సిస్టమ్స్ ఇంక్
GPX ఎంఈఎన్ఏ`మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా మార్కెట్లలో ప్రైవేట్, క్యారియర్-న్యూట్రల్, అత్యాధునిక డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తుంది, నిర్వహిస్తుంది. దీని డేటా సెంటర్లు క్యారియర్-న్యూట్రల్ ఇంటర్నెట్ ఎకో సిస్టమ్లను అభివృద్ధి చేస్తున్నాయి. అతిపెద్ద క్యారియర్లు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, కంటెంట్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు నిలయంగా ఉన్నాయి.
ఇది కీలకమైన వ్యాపార మౌలిక సదుపాయాలను కోలోకెట్ చేయాలని చూస్తున్న దేశీయ, అంతర్జాతీయ క్లయింట్లకు సురక్షితమైన, అత్యంత విశ్వసనీయమైన క్యారియర్-న్యూట్రల్ డేటా సెంటర్లను అందిస్తుంది. 2007లో ఈజిప్టులోని కైరోలో మొదటి డేటా సెంటర్ను నెలకొల్పింది. 2016 ప్రారంభంలో న్యూ కైరోలో రెండవ డేటా సెంటర్ను ప్రారంభించింది. జూన్, 2012లో దక్షిణాసియాలోని ముంబైలో మొదటి డేటా సెంటర్ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో అధిక-నాణ్యత సౌకర్యాలు, సేవా స్థాయులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, GPX 16 మెగావాట్ల మొత్తం విద్యుత్ వినియోగంతో ముంబైలో తన రెండవ డేటా సెంటర్ను ప్రకటిం చింది. దీని కస్టమర్లలో టెల్కోలు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్లు`సీడీఎన్లు, ఇ-వ్యాపారాలు, ఎంటర్ప్రైజ్ క్లయింట్లు ఉన్నారు.
4. నెట్మ్యాజిక్
NTT కమ్యూనికేషన్స్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన నెట్మ్యాజిక్ 9 డేటా సెంటర్లతో ప్రముఖ మేనేజ్డ్ హోస్టింగ్, మల్టీ-క్లౌడ్ హైబ్రిడ్ ఐటీ సొల్యూషన్ ప్రొవైడర్గా నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2000 కంటే ఎక్కువ ఎంటర్ ప్రైజ్లకు సేవలు అందిస్తుంది. ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని NTT కమ్యూనికేషన్స్ కస్టమర్లతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎంటర్ ప్రైజ్ కస్టమర్ లకు రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్-ఆర్ఐఎం సేవలనూ అందిస్తుంది. దేశంలో క్లౌడ్ కంప్యూటింగ్, మేనేజ్డ్ సెక్యూరిటీ, డిజాస్టర్ రికవరీ-యాజ్-ఎ-సర్వీస్ (డీఆర్ఏఏఎస్) సాఫ్ట్వేర్-డిఫైన్డ్ స్టోరేజ్ వంటి సేవలను ప్రారంభించిన మొదటి సర్వీస్ ప్రొవైడర్గా పేరు సంపాదించుకుంది.
5. NxtGen
NxtGen తన కస్టమర్లకు హైపర్-కన్వర్జ్డ్ మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా వారు సంక్లిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలకు ఎలాంటి పెట్టుబడి లేకుండానే డిజిటల్ వ్యాపారాన్ని నిర్మించు కోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది సింగ పూర్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. భారతదేశం, సింగపూర్ అంతటా సమగ్రమైన డేటాసెంటర్, క్లౌడ్ సేవలను అందించే ఒక వర్ధమాన సర్వీస్ ప్రొవైడర్గా ఆవిర్భవించించింది.
ఇది ఆన్-ప్రిమైజ్ వనరులు, ఇన్ఫినిట్ డేటాసెంటర్ టీఎం పేరిట దాని స్వంత ఫెసిలిటీలు కలబోతగా ఐటీ మౌలిక సదుపా యాల సేవలను అందిస్తుంది. కస్టమర్లకు తాజా హైబ్రిడ్ కంప్యూ టింగ్ మోడల్ను ఆపాదించుకు నేలా సాధికారత కల్పిస్తుంది.
6. Nxtra డేటా లిమిటెడ్
భారత్కి చెందిన డేటాసెంటర్ మేనేజ్డ్ సర్వీసెస్ వ్యాపారాన్ని నిర్వహించడానికి Nxtra డేటా లిమిటెడ్ ఏర్పడిరది. ఇది ప్రస్తుతం మనేసర్, నోయిడా, చెన్నై, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, పూణేలలో సుమారు 2,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ నెట్వర్క్ కనెక్టివిటీతో పాటు కో-లొకేషన్, మేనేజ్డ్ హోస్టింగ్, మేనేజ్డ్ సర్వీసెస్, మేనేజ్డ్ సెక్యూరిటీ, మేనేజ్డ్ బ్యాకప్, స్టోరేజ్, వర్చువల్ కంప్యూట్, క్లౌడ్ సహా డేటా సెంటర్ మేనేజ్డ్ సేవల ఇంటిగ్రేటెడ్ పోర్ట్ఫోలియోను అందిస్తుంది.
7. Sifyటెక్నాలజీస్
ఇది భారతదేశంలోని ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఐసీటీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ సంస్థ. దేశంలోని 1550కి పైగా నగరాలు, పట్టణాలకు చేరుకునే సాధారణ టెలికాం డేటా నెట్వర్క్ మౌలిక సదుపా యాల ద్వారా పంపిణీ అవుతున్న విస్తృత శ్రేణి పరిష్కారాలు, ఉత్పత్తులను అందిస్తుంది. Sify టెలికాం నెట్వర్క్ ప్రస్తుతం భారతదేశం అంతటా 45 డేటా సెంటర్లను కలుపుతుంది. వీటిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఏకకాలంలో నిర్వహించ గల ఆరు డేటా సెంటర్లు ఉన్నాయి. 1998లో, తన నెట్వర్క్ ద్వారా లక్షలాది మందికి మొదటిసారిగా ఇంటర్నెట్ను రుచి చూపించిన మొదటి భారతీయ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్`ఐఎస్పీగా నిలిచింది. అంతర్జాతీయ కాల్ సెంటర్ల కోసం ఇంటర్నెట్కేఫ్, డేటా, వాయిస్ సేవలకు మార్గదర్శకు రాలిగా పేరు సంపాదించుకుంది. నేడు కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ప్రధాన కార్యాలయంతో అమెరికా అంతటా విస్తరించింది. Sifyకి 8,500 కంటే ఎక్కువ మంది ఎంటర్ప్రైజ్ కస్టమర్లు ఉన్నారు.
8. టాటా కమ్యూనికేషన్స్
టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలతో, సరికొత్త కమ్యూనికేషన్ల ప్రపంచానికి ప్రముఖ అంతర్జాతీయ సర్వీస్ ప్రొవైడర్గా ఉంది. టాటా కమ్యూనికేషన్స్ దాని గ్లోబల్ నెట్వర్క్లో అధునాతన పరిష్కారాల సామర్థ్యాలను, డొమైన్ నైపుణ్యాన్ని బహుళ జాతి కంపెనీలు, కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు సొల్యూషన్లను అందించడానికి ఉపయోగించుకుంటుంది.
దాని గ్లోబల్ నెట్వర్క్లో అధునాతనమైన అతిపెద్ద జలాంతర్గామి కేబుల్ నెట్ వర్క్, టైర్`1 ఇంటర్నెట్ ప్రొటోకాల్`ఐపీ నెట్వర్క్ 400 పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ పోస్టాఫీస్ ప్రొటో కాల్ `పీఓపీలు అంతటా 240కు పైగా దేశాలను, భూభాగాలను అనుసంధానం చేస్తుంది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో డేటా సెంటర్, కో`లొకేషన్ ఫెసిలిటీలు ఉన్నాయి. టాటా కమ్యూనికేషన్స్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల పరిధిలో రారాజులా భారత్ వెలుగుతోంది.
9. Yotta
హిరానందని గ్రూప్ ఆధ్వర్యంలోని Yotta భారీ డేటా సెంటర్ పార్కుల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ చేపడుతుంది. దీనికి చెందిన 50కు పైగా ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన డేటా సెంటర్ పార్కులు ఒక ర్యాక్ నుండి పూర్తి భవనం వరకు లేదా విస్తృతశ్రేణి సేవలను అందించే డేటా సెంటర్ల వరకు మొత్తం 11 డేటా సెంటర్లను కలిగి ఉన్నాయి. ఇది అత్యంత అనుభవజ్ఞులైన, ధ్రువీకృత డేటా సెంటర్ డిజైన్ బృందాన్ని కలిగి ఉంది. వారు ఎలక్ట్రికల్, మెకానికల్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిష నింగ్ సిస్టమ్` హెచ్వీఏసీ, ఆటోమేషన్, ఫైర్ ఫైటింగ్, భౌతిక భద్రతలో అత్యుత్తమ నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని Yotta పేర్కొంది.
సేవల్లో రకాలు
ప్రపంచంలోని ఇతర డేటా సెంటర్ల (డీసీలు) మాదిరిగానే డీసీలు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి.
కో-లొకేషన్ సేవలు
కో-లొకేషన్ ఫెసిలిటీ లేదా కొంతమంది దీనిని కోలో అని పిలుస్తారు. కోలో, డేటా సెంటర్ ఫెసిలిటీ అనేది ఒక సర్వీసు. దీనిలో ఒక కంపెనీ/వ్యక్తి సర్వర్లు ఇతర కంప్యూటింగ్ హార్డ్వేర్ కోసం భౌతిక స్థలాన్ని అద్దెకు తీసుకోవచ్చు.
డీసీ భవన మౌలిక సదుపాయాలు, శీతలీకరణ వ్యవస్థ, విద్యుత్తు, బ్యాకప్, బ్యాండ్విడ్త్, భౌతిక భద్రతను అందిస్తుంది.కస్టమర్ సర్వర్లు, స్టోరేజీని అందిస్తారు. ఇందుకుగాను డీసీ అద్దె వసూలు చేస్తుంది.
సూట్లు, కేజ్లు
డీసీలోపల ఉన్న డీసీని సూట్ అంటారు. వీటిని ప్రైవేట్ డీసీ సూట్లు అని కూడా పిలుస్తారు. సూట్లు అనువైనవి. అధిక సాంద్రత కలిగిన క్యాబినెట్లు, హాట్/కోల్డ్ ఐసెల్ కంటైన్మెంట్ సొల్యూషన్లతో సహా కస్టమర్ అవసరాల ప్రకారం నిర్మితమవుతాయి. కేజ్ కోలొకేషన్ అనేది పూర్తిగా అనుకూలీకరించదగిన పరిష్కారం. ఇది ఏదైనా డీసీకి సురక్షిత ప్రాంతానికి లైసెన్స్ ఇవ్వడానికి అనుమతిస్తుంది, ఇది నేల నుండి పైకప్పు ఎన్క్లోజర్ వరకు సురక్షిత పరిమితులతో అనువైన స్థలం, భద్రత, విస్తరణ కాన్ఫిగరేషన్ను అనుమతిస్తుంది.
ర్యాక్ క్యాబినెట్లు
ర్యాక్ సర్వర్ దీనినే ర్యాక్-మౌంటెడ్ సర్వర్ అని కూడా పిలుస్తారు. ఇది సర్వర్గా ఉపయోగించడానికి అంకితమైన ఓ కంప్యూటర్. దీనిని ర్యాక్ క్యాబినెట్ అనే ఫ్రేమ్వర్క్లో ఇన్స్టాల్ చేయడానికి రూపొందిం చారు. ర్యాక్ క్యాబినెట్ బేలు అని పిలిచే బహుళ మౌంటు స్లాట్లను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి స్క్రూలతో హార్డ్వేర్ యూనిట్ను భద్రపరచడానికి నిర్మితమయ్యాయి.
డెడికేటెడ్ సర్వర్
ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్ ఎంపికతో సహా సర్వర్లపై సంస్థలకు పూర్తి నియంత్రణ ఉంటుంది కాబట్టి ఇది షేర్డ్ హోస్టింగ్ కంటే మరింత సరళమైనది.
విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు చేయడం వికసిత్ భారత్లో మరో అడుగు. భారత్ ప్రపంచ సాంకేతిక రంగంలో సుస్థిర స్థానం పొందే దిశలో కీలక పరిణామం. మన దేశంలో డిజిటల్ ఎకానమీకి కొత్త ఊపును ఇస్తుంది. ఇది ప్రజలకు అత్యంత అధునాతమైన సాంకేతికతను అందించడంలో, సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. గూగుల్ స్థాపిస్తున్న ఏఐ హబ్ బహుళార్థక ప్రాజెక్టుగా వికసిస్తుంది.
- ప్రధాని నరేంద్ర మోదీ
విశాఖ గూగుల్ ఏఐ హబ్ అమెరికా వెలుపల మేం ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద తొలి ఏఐ హబ్గా నిలుస్తుంది. ఇది భారత్ సాంకేతిక రంగంలో ఒక మైలురాయి అవుతుంది. మేం భారత ప్రజలకు, సంస్థలకు అధునాతన సాంకేతికతను అందిస్తున్నాం. మేం స్థాపించే ఏఐ హబ్ కారణంగా కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయి. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం గురించి ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడాను. ఆయనతో సంభాషించడం ఎంతో సంతోషకరమైన సందర్భం.
- సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
విశాఖ ఏఐ హబ్ కోసం వచ్చే ఐదేళ్లలో 1500 డాలర్ల పెట్టుబడి పెడతాం. 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తాం. భారత్ను అంతర్జాతీయ నెట్వర్క్తో అనుసంధానం చేస్తాం. ఆ క్రమంలో అత్యంత కీలకమైన సముద్ర గర్భంలో కేబుల్స్ వేస్తాం. దీంతో మున్ముందు విశాఖ నుంచే గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీ మెయిల్, తదితర సేవలన్నీ అందించే అవకాశం ఉంటుంది.
- థామస్ కురియన్, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ
సాంకేతికతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు దేశ ప్రగతిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. గూగుల్ నెలకొల్పుతున్న అతిపెద్ద డేటా సెంటర్ దేశ ప్రజల జీవితాలను మారుస్తుంది.
- అశ్విని వైష్ణవ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దూరదృష్టి ఉన్న నేతలు. ఆ కారణంగానే విశాఖకు ఇంత మంచి ప్రాజెక్టు అతివేగంగా వచ్చింది. అటు కేంద్రంలోనూ, ఇటూ ఏపీలోను సుపరిపాలనవల్లే ఇది సాధ్యమైంది.
- నిర్మల సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
– జాగృతి డెస్క్