ఆంధప్రదేశ్‌లోని నెల్లూరుకు కూడా బుల్‌డోజర్‌ ‌వైద్యం అవసరమని బీజేపీ వ్యాఖ్యానించింది. అసలే అక్రమ కట్టడం. అందులో మాటు వేసిన మతోన్మాదులు ప్రశాంతంగా సాగుతున్న హనుమాన్‌ ‌జయంతి శోభాయాత్రను గేలి చేశారు. రాళ్లు రువ్వారు. మరీ మతోన్మాదం తకెక్కిన ముస్లిం కుర్రాళ్లు హిందువులు పరమ భక్తిగా పూజించే హనుమాన్‌ ‌ప్రతిమ మీద బీర్‌ ‌సీసాలు కూడా విసిరారు. ఎందుకు వచ్చారో తెలియదు. ఎప్పుడు వచ్చారో తెలియదు. మూడు లేదా నాలుగు వందల మంది ముస్లింలు అక్కడి మసీదులో దాగి శోభాయాత్ర అక్కడికి వచ్చిన సమయానికి రెచ్చిపోయారు. ఆశ్చర్యంగా, ఆ మూకలో ఉదారవాద, సెక్యులర్‌ ‌పార్టీల ప్రముఖులు కూడా ఉన్నారు. ఆ మసీదు పేరు ఖుద్దూస్‌ ‌మసీదు. ఇవన్నీ పరిశీలించిన తరువాతే బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధప్రదేశ్‌ ‌వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌ ‌బుల్‌డోజర్‌ ‌వైద్యం గురించి ఆలోచించమని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డికి సూచించారు. కానీ ఆ ఉన్మాదుల మీద చర్యలు తీసుకోవడానికి వెనువెంటనే ముఖ్యమంత్రి కదిలి ఏదో చేస్తారని ఎవరూ నమ్మడం లేదు. ఆంధప్రదేశ్‌లో కూడా బుజ్జగింపు శృతి మించి, ముస్లిం మతోన్మాదుల ఆగడాలు బుల్‌డోజర్‌ ‌వైద్యం వరకు వెళ్లాయని హెచ్చరించడానికే ఆ ప్రకటన.

ఈ సమాచారం తెలుగు రాష్ట్రాలకి చేరడానికీ, తరువాత దేశవ్యాప్తం కావడానికీ జరిగిన ఆలస్యమే బాధాకరమైనది. పాలకులు, మీడియా, ఉదారవాద, సెక్యులర్‌ ‌పార్టీలు హిందువులకు చేస్తున్న ద్రోహంలో ఇదంతా భాగమని చెప్పడానికి ఇది చాలు. పాలకులలో నానాటికీ హిందువుల పట్ల పెరుగుతున్న అలక్ష్యానికి ప్రబల నిదర్శనం కూడా. మసీదు అంటే ఆ వర్గానికి పవిత్రమైనదని మనం అనుకుంటాం. కానీ హిందూధర్మాన్ని వికృత సంకేతాలతో అక్కడ నుంచి అవహేళన చేయడం, బీరు సీసాలు విసరడం పాపకార్యం కాదని చెప్పక చెప్పారు. ‘అది అక్రమంగా కట్టిన మసీదు. దానిని కూల్చేయమని కోర్టు ఎప్పుడో ఆదేశించింది. అది జరగలేదు. సరిగ్గా అక్కడ నుంచే రాళ్లు విసిరారు. బీరు సీసాలు విసిరారు’ అని బీజేపీ ఎంఎల్‌సీ వాకాటి నారాయణరెడ్డి ట్వీట్‌ ‌చేశారు. దీనిని పోలీసు యంత్రాంగం ఆలస్యం లేకుండా ఖండించింది. అసలు మసీదు నుంచి రాళ్లే రాలేదని బుకాయించింది. ‘రాళ్లు రువ్వడమే కాదు, బీరు సీసాలు విసరడమే కాదు, మత దురహంకారాన్ని వ్యక్తీకరించే నినాదాలు కూడా ముస్లింలు చేశారు. ‘ప్రశాంతంగా సాగుతున్న హిందువుల ఊరేగింపుకు దక్కిన మర్యాద ఇది. హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఈ దేశంలో  హిందువుల దుస్థితి ఇదీ. హిందూ దేవతలను, దేవుళ్లను దూషించినా దిక్కు లేదు. శాంతి, సెక్యులరిజం అంటూ పాఠాలు వల్లె వేస్తే కనీసం మనం రోడ్ల మీదకు వచ్చే స్వేచ్ఛ కూడా మిగలదు. ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి’ అని కూడా ఎంఎల్‌సీ తన ట్వీట్‌ ‌ద్వారా ఆక్రోశం వెలిబుచ్చారు. ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆత్మకూరులో ముస్లిం మతోన్మాదులే రెచ్చిపోయి మసీదు అక్రమ నిర్మాణం కోసం ఎంత అల్లరి సృష్టించారో ఇంకా మరచిపోక ముందే నెల్లూరు పట్టణంలో అలాంటి రగడే సృష్టించారు. ఈ ఘటనలన్నింటిని విడివిడిగా చూడలేం. అంటువ్యాధిలా విస్తరిస్తున్న మతోన్మా దానికి ఇది రుజువు.

ఏం జరిగింది?

హనుమాన్‌ ‌జయంతికి దేశంలో చాలాచోట్ల హిందువులు తలపెట్టినట్టే నెల్లూరు పట్టణంలో కూడా శోభాయాత్రను తలపెట్టారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తితిదే కల్యాణ మండపం వద్ద ఉన్న శబరి శ్రీరామక్షేత్రం నుంచి స్టోన్‌హౌస్‌పేటలోని ప్రభుత్వ పాఠశాల వరకు దాదాపు 11 వేల మంది (కొన్ని జాతీయ చానెళ్లు 15,000 మంది అని పేర్కొన్నాయి) భక్తులు కాషాయ జెండాలు చేతబూని పాల్గొన్నారు. 7,200 ద్విచక్ర వాహనాలు యాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జైశ్రీరామ్‌, ‌జైజై హనుమాన్‌, ‌భారత్‌మాతాకీ జై నినాదాలతో ఉత్సాహంగా కదిలింది యాత్ర. కొందరు హిందూ యువకులు కర్రలు, కత్తులు, ఉరుమి వంటి ఆయుధాలతో వీధులలో చేసిన వీరోచిత విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వాటిని తిలకించిన ప్రజలు ఉత్సాహంతో జయజయ ధ్వానాలు చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో ఇలా వేలాదిమంది హిందు వులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ హనుమాన్‌ ‌శోభాయాత్ర కొందరు ముస్లింలలో కలవరం రేకెత్తించింది. కోర్టు, మసీదు మీదుగా వెళ్తున్న యాత్ర, కోలాహలాన్ని చూడగానే మసీదులోనే కాపు కాసిన  కొందరు ముస్లింలు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. అసహ్యకర రీతిలో వేళ్లు చూపుతూ, సజ్ఞలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కర్రలు చూపుతూ, చేతులు ఊపుతూ బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ హిందూ భక్తులు ఏమాత్రం ఉద్రేక పడకుండా తమ ఊరేగింపును యథావిధిగా శాంతియుతంగా కొనసాగించారు. పోలీసులు కూడా సదరు మసీదు గేట్లు మూసివేసి, గేటుకు అడ్డంగా వాహనాలను నిలిపి అప్రమత్తంగా వ్యవహ రించడంతో సమస్య తాత్కాలికంగా సద్దు మణిగింది. కానీ మసీదులో సుమారు 400 నుంచి 500 మంది ముస్లింలు అప్పటికే గుమికూడి ఉన్నట్లు సమాచారం. అసలు ఆ సమయంలో అంతమంది ఆ మసీదులో ఎందుకు గుమిగూడారన్న ప్రశ్నతో సహా ఆ సంఘ టన చుట్టూ ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. ఇదంతా ఏమిటి? హిందూ జాగృతిపై ఉక్రోషమేనా? అదే అయితే ఎందుకు? హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులని ముస్లింల అభిప్రాయమా? ముస్లిం బుజ్జగింపు ధోరణిలో భాగంగా రాజకీయ పార్టీలు కూడా ఇదే నమ్ముతున్నాయా?

రాజ్యాంగం చెబుతోన్న లౌకికవాదాన్ని హిందు వులు తప్ప ముస్లింలు, క్రైస్తవులు అనుసరించడం లేదనేది దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఏళ్ల తరబడి జరుగుతున్న సంఘటనలను బట్టి ఎవరికైనా అర్ధం అవుతోంది. హిందువులు ఎంత శాంతియుతంగా వున్నా ఈ అన్యమత అవలంబీకులు మాత్రం హిందూయిజాన్ని నామరూపం లేకుండా నాశనం చేద్దామనే ప్రయత్నాలు చేస్తున్నాయి. పథకం ప్రకారం హిందూధర్మాన్ని అవమానించడం, ఆలయాలను ధ్వంసం చేయడం, మసీదులు, చర్చిలు ఎక్కడపడితే అక్కడ నిర్మించడం, అన్యమతాల సాహిత్యం విస్తృతంగా ప్రచారం చేయడం, గ్రామాల్లో విచ్చల విడిగా అన్యమత ప్రచారం చేయడం, మతమార్పిడిలు ముమ్మరంగా చేయడం తీవ్రంగా జరుగుతోంది. లౌకిక పార్టీలుగా చెలామణి అయిన కాంగ్రెస్‌ అన్యమత దుర్మార్గాలను పెంచి పోషిస్తే దానికి తాను ముక్కల్లా పుట్టుకొచ్చిన స్ధానిక పార్టీలు మరింత ప్రోత్సహిస్తున్నాయి. ఎపీలో వైకాపా ప్రభుత్వం, కాంగ్రెస్‌ను మించి పరమతాలను ప్రోత్సహిస్తూ, ముస్లింల, క్రైస్తవుల పార్టీగా మారిపోయింది.

అదో అక్రమ కట్టడం

హనుమాన్‌ ‌శోభాయాత్ర సందర్భంగా కొందరు ముస్లింల ద్వారా రెచ్చగొట్టే నినాదాలు వెలువడిన ఆ మసీదు ఓ అక్రమ కట్టడం. ఆ కట్టడాన్ని కూల్చేయమని 2003లోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓట్ల కక్కుర్తితో పార్టీలు, ప్రభుత్వాలు ఇన్నాళ్లూ ఉదాసీనంగా వ్యవహరించాయి. స్థానిక హిందువులు కూడా అంతా మనవారేగా అనుకుని మిన్నకున్నారు. కానీ ఇప్పుడు రామనవమి, హనుమాన్‌ ‌జయంతి సందర్భంగా హిందువులు ఉత్సవాల మీద దేశంలో చాలా చోట్ల జరిగినట్టే ఇక్కడ కూడా జరిగింది. ఆ అక్రమ కట్టడం నుంచే కొందరు ముస్లింలు రెచ్చ గొట్టే నినాదాలు చేస్తూ వేలితో వెకిలి వెక్కిరింతలు. కవ్వింపులు- బెదిరింపులకు పాల్పడడంతో ఇప్పుడు దాని మనుగడపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ దారుణం రాజస్తాన్‌లోని కరౌలి, ఢిల్లీలోని జహంగీర్‌పురి, మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌లలో ఏం జరిగిందో ఏ పార్టీకి సంబంధం లేనివారికి కూడా గుర్తు చేసింది. మసీదు కట్టిన స్థలం ప్రజాపనుల శాఖకు చెందినదని ఎంఎల్‌సీ వాకాటి చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితమే ముస్లింలు ఆక్రమించారు. ఈ మసీదును కూల్చేయమని నాలుగేళ్ల క్రితమే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ప్రభుత్వాలకీ, అధికారులకీ ఆ దమ్ము లేదు. ముస్లిం జోలికి వెళ్లడం కన్నా, కోర్టు ధిక్కారమే సులభమని వారంతా భావిస్తున్నట్టే ఉంది. ఇంత జరిగిన తరువాత ఇక తాము ఉపేక్షించబో మని, కోర్టు ధిక్కారం కింద మళ్లీ కోర్టును ఆశ్రయిస్తా మని వాకాటి హెచ్చరించారు. ఆ మసీదులో మతో న్మాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి మీద కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నగరంలో మత సామర స్యాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవలసిందిగా ఇప్పటికే కలెక్టర్‌కు బీజేపీ, హిందూ సంస్థలు వినతి పత్రం సమర్పించాయి. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఇంత తీవ్రత ఉన్న ఘటనను కూడా మీడియా సకాలంలో, సరైన రీతిలో స్పందించడం చేయలేద న్నది నిజం. పైగా ఫ్రంట్‌లైన్‌ అనే పత్రిక వెబ్‌సైట్‌ ‌తమకే పోలీసులు ప్రత్యేకంగా చెప్పినట్టు కొన్ని జుగుప్సాకర రాతలు రాసింది. మసీదు నుంచి రాళ్లు రువ్విన మాట నిజం కాదట. ఆర్‌ఎస్‌ఎస్‌, ‌వీహెచ్‌పీ, బజ్రంగ్‌దళ్‌ ‌సంస్థల సభ్యులు మూడు వేల మంది ఈ యాత్రలో ఉన్నారట. నెల్లూరు మెయిన్‌ ‌రోడ్డులోని కోర్టు ప్రాంగణం దాకా ప్రశాంతంగా వచ్చిన ఊరేగింపును అక్కడ పోలీసులు మళ్లించే ప్రయత్నం చేశారట. అక్కడే ఖుద్దూస్‌ ‌మసీదు ఉంది. కానీ ఊరేగింపు నిర్వహిస్తున్నవారు పోలీసుల మార్గదర్శ కాలు పాటించడానికి నిరాకరించారట. మసీదు దగ్గర నుంచి వేగంగా ఊరేగింపు సాగాలని కోరినా వినలేదట. పైగా అక్కడికి వచ్చే సరికే లౌడ్‌ ‌స్పీకర్ల శబ్దం పెంచారట. ఊరేగింపులో ఉన్న ద్విచక్ర వాహనాలు హారన్‌ ‌మోతలు కూడా పెరిగాయట.

నెల్లూరు పోలీసు సూపరింటెండెంట్‌ ఈ ‌పత్రికకే చెప్పిన విషయాలు కూడా గమనించదగినవే. ఆ విశేషాలు ఇవి: అది నమాజ్‌ ‌వేళ కాదు. అయినా తాము నమాజ్‌ ‌చేయడానికి వచ్చామంటూ కొంత మంది యువకులు అక్కడికి చేరారు. శోభా యాత్రలోని కొందరు రెచ్చగొట్టే తీరులో ఇచ్చిన సంకేతాలతో ఆ యువకులు అల్లాహో అక్బర్‌ అం‌టూ నినాదాలు చేశారు. ఒక్క ముస్లిం యువకుడు మాత్రం అసహ్యకరమైన భంగిమను సంకేతిస్తూ వేలు చూపించాడు (బయటకొచ్చిన వీడియోలో కనీసం ఐదారుగురు ఈ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది). చిత్రం ఏమిటంటే, ఉదారవాద, సెక్యులర్‌, ‌ప్రజాస్వామ్య పార్టీ ఏదైనా అందులోని ముస్లింలంతా హిందువుల పట్ల వ్యతిరే కత విషయంలో ఏకత్రాటిపై స్థిరంగా ఉంటారు. నెల్లూరు ఎస్‌పీ చెప్పిన విషయమే దీనిని రుజువు చేస్తున్నది. నెల్లూరు డిప్యూటి మేయర్‌ ‌షేక్‌ ‌ఖలీల్‌, ఇం‌డియన్‌ ‌నేషనల్‌ ‌లీగ్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సయ్యద్‌ ‌సమీ హుసేన్‌, ‌తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకుడు షేక్‌ ‌జఫార్‌, ‌వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు షేక్‌ ‌సిద్దికి, ఇంకొందరు ప్రముఖ ముస్లింలు అక్కడ ఉన్నారు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?

ప్రభుత్వాల మద్దతు

రాష్ట్రంలో హిందూధర్మం, హిందువులపై జరుగుతున్న దాడులకు అన్యమతవ్యాప్తి, అసహనం ప్రధాన కారణం. మత వ్యాప్తి ప్రధానంగా ముస్లిం, క్రైస్తవ మతాలు పుట్టాయి. వ్యక్తిలో భూతదయ, శాంతి, ప్రేమ, వైరాగ్యం పుట్టించి వారిలో దైవత్వాన్ని ప్రేరేపించడం మతాల ప్రధాన ఉద్దేశంగా ఉండాలి. కాని ముస్లిం, క్రైస్తవ మతాలు మాత్రం మనదేశంలో ఎప్పుడూ ఈ ఉద్దేశంతో పనిచేయలేదు. ఆ మతాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేస్తున్న హింసా త్మక సంఘటనలను బట్టి అవి మత వ్యాప్తికే 100 శాతం ప్రాధాన్యం ఇస్తున్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు.

మత రాజ్యాలను ఏర్పాటుచేయడం కోసం ప్రజలందరినీ తమ మతాల్లోకి మార్చి వేస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాల వల్ల ప్రపంచంలో ప్రజా స్వామ్యం కనుమరుగైపోతోంది. ఆంధప్రదేశ్‌లో పరిణామాలు అందులో భాగమే. ఇక్కడ అన్యమతాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి స్ధానిక పార్టీల కుళ్లు రాజకీయమే కారణం. ఓట్ల కోసం అన్య మతాలను ప్రోత్సహిస్తూ హిందువులను పట్టించు కోవడం మానేశాయి. హింసకు పాల్పడినా తప్పు పట్టలేదు సరికదా హిందువులనే దోషులుగా చూడటంతో అన్యమతాల అరాచకం పెరిగి పోయింది. దీనికి పోలీసులు వత్తాసు పలకడమే ఇంకా పెద్ద విషాదం. ఇదే నేటి దుస్థితికి కారణం.

తమ అజెండా అమలుచేస్తున్న అన్యమతాలు

పాలించేది తమ ప్రభుత్వమే, ఇక తమకు అడ్డులేదని ఈ రెండు మతాల వారు భావించారు. ఎవరికి వారు మతమార్పిడులకు తీవ్రంగా ప్రయత్నించసాగారని మూడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను తెలియచేస్తున్నాయి. హిందూధర్మంపై దాడులు, ఆలయాలు, విగ్రహాలు, రథాల ధ్వంసం, దగ్ధం వంటి సంఘటనలు జరిగాయి. హిందూ సమాజం మొత్తం ఈ దురదృష్ట సంఘటనలతో బాధపడినా ప్రభుత్వం స్పందించ లేదు. దీనికి తోడు హిందువులను ఊచకోత కోసిన టిప్పుసుల్తాన్‌ ‌విగ్రహం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, మసీదులు, చర్చిల అక్రమ నిర్మాణం, వాటిని అడ్డుకుంటే భౌతిక దాడులకు పాల్పడటం, తిరుమల కొండ మీద భక్తులకు మదర్‌ ‌థెరిసా సంస్థ మిషనరీలు వచ్చి కరపత్రాలు పంచడం, శ్రీశైలంలో గోడల మీద యోహాను సువార్త వాక్యాలు రాయడం, శ్రీశైలంలో కర్ణాటక భక్తునిపై గొడ్డలితో దాడి చేయడం, రామచంద్రాపురం మండలం, కె. గంగవరం గ్రామం లోని రామాలయంలో కూటములు నిర్వహించడం, ఈ అకృత్యాన్ని అడ్డుకున్న హిందూ భక్తులపై దాడిచేసి కేసు పెట్టడం, శ్రీశైలంలో స్వామివారికి తెచ్చే పూలగంపల చాటున మద్యం బాటిల్స్ ‌సరఫరా చేయడం, అన్నదాన సత్రం వెనుక బెల్టుషాపులు నడవడం, గోశాలలో నెలకు నాలుగైదు ఆవులు మరణించడం, పాపాలచెరువు ప్రాంతలో గంజాయి సాగు, పెద్దకాకాని పుణ్యక్షేత్రంలోని క్యాంటీన్‌లో మాంసాహారం తయారీ హిందూధర్మాన్ని, పుణ్య క్షేత్రాల పవిత్రతను అవమానించే సంఘటనలే.

స్నేహభావమే అలుసా?

రాయిని, చెట్టుని, ప్రకృతిని సైతం దైవంలా భావించే హిందువులు, పరమతాల దైవాలను సైతం తమ దైవంగానే ఆరాధిస్తారు. అదే పాపమైపోయింది. చర్చిలకు సైతం వెళ్లే హిందువులు, మేరీమాత తిరుణాళ్లు, ముస్లింల రొట్టెల పండుగలో సైతం భారీగా కనిపిస్తారు. కాని హిందువుల సహనాన్ని, మత సామరస్యాన్ని అన్యమతాలు చేతకాని తనంగా భావిస్తున్నాయి. ఇందుకు హిందువులను వెర్రివాళ్లుగా చూస్తున్నాయని చెప్పినా అసత్యం కాదు. నిరక్ష రాస్యులు, అమాయకులైన హిందువుల పేద రికాన్ని, అనారోగ్యాలను ఆసరాగా తీసుకుని, వారికి మేలు చేస్తామని నమ్మించి మతమార్పిడులకుపాల్పడుతున్నారు.

హిందూధర్మం కర్మ సిద్దాంతం గురించి చెబు తుంది. వ్యక్తులు చేసే పాపపుణ్యాలే పునర్జలని, మోక్షసాధన దిశగా జీవితాన్ని ముందుకు తీసు కెళ్లాలని చెబుతుంది. కాని పరలోకంలో లభించే సుఖాల గురించి, పాపాలను క్షమించడం గురించే క్రైస్తవం చెబుతోంది. దీనిని అడ్డం పెట్టుకుని క్రైస్తవాన్ని నమ్మితే ధనం లభిస్తుందని, రోగాలు నయమవుతాయని, పరలోకంలో సుఖం లభిస్తుందని, చేసిన పాపాలు ఒక్క క్షణంలో తమదేవుడు క్షమిస్తాడని అమాయకులను నమ్మించి ఆకర్షిస్తున్నారు. ఏడాదికోసారి కూడా గుళ్లకు వెళ్లే అలవాటులేని హిందువులను వారం వారం చర్చిలకు రప్పించుకుని హిందూ దేవుళ్లను తిట్టించి, వారి ఆదాయంలో పదోభాగం హక్కుగా పొందుతున్న పాస్టర్ల మోసాన్ని ఈ అమాయకులు తెలుసుకోలేకపోతున్నారు. పుట్టిన మనిషి చావక తప్పదని, అనారోగ్యానికి గురైన రోగిని బతికించేది వైద్యం కాని దేవుడు కాదని ఈ అమాయకపు గొర్రెలు తెలుసుకోలేకపోతున్నారు. హిందువులను ఆశాంతికి గురిచేయమని ఇస్లాం చెప్పనప్పటికీ కొందరు ముస్లింలు ఆ మార్గంలోనే నడుస్తున్నారు. ఆ మతం చెప్పిన విగ్రహారధన హిందువుల ఆయాలు, విగ్రహాలు ధ్వంసానికి కారణమైంది.

– తురగా నాగభూషణం,  సీనియర్‌ ‌జర్నలిస్‌

About Author

By editor

Twitter
Instagram