బిహార్‌ ఎన్నికలతో భారత రాజకీయాలు నూతన దశలోనికి ప్రవేశించాయి. రాజకీయ సంప్రదాయక నిర్వచనాలను, విశ్లేషణలను మార్చివేశాయి. ప్రపంచ రాజకీయ వేదికను దశాబ్ద కాలంగా పరిశీలిస్తే కొన్ని దేశాలలో ‘జనరేషన్‌-‌జెడ్‌’ (+‌వఅ ్గ) అని పిలుస్తున్న యువతరం, ముఖ్యంగా మహిళా ఓటర్లు తమ రాజకీయ ప్రాధాన్యతలను, ఆకాంక్షలను, అసహనాన్ని తిరుగుబాటు ధోరణితో  చాటుతున్నారు. వాటిని ఆధారం చేసుకుని గత కొంత కాలంగా కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఓట్‌ ‌చోరీ నినాదం పట్టుకున్నారు. దేశంలో ఉద్యమం వస్తుంది, బీజేపీ కథ ముగుస్తుం దంటూ యువతను, మహిళలను అనేక వేదికల నుంచి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో వెలువడినవి కాబట్టే బిహార్‌ ‌ఫలితాలక• అంత ప్రత్యేకత.

రాహుల్‌ ఆశించిన ప్రమాదకర పోకడలకు బిహార్‌ ఎన్నికలు చెంప చెళ్లుమనిపించే తీరులో సమాధానం ఇచ్చాయి. ఈ ఎన్నికల గెలుపోటములు దేశ యువత, మహిళల ఆకాంక్షలకు, ఆలోచనలకు ప్రతిరూపంగా మారిపోయాయి. అక్కడ ఎన్డీయే విజయం కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు. దేశాభివృద్ధి, సుస్థిరత, జాతీయ గౌరవం పట్ల యువత, మహిళలకు ఉన్న దృఢ విశ్వాసం, మోదీ, ఎన్డీయేల పట్ల విస్తృత స్థాయిలో లభించిన ప్రజా మద్దతుకు ప్రతిబింబింబం. రాహుల్‌ ‌వంటి ప్రతిపక్ష నాయకులు ‘దాడులతో కూడిన జెన్‌ ‌జడ్‌ ఉద్యమం’ వస్తుందని హోరెత్తించినప్పటికీ  భారతీయ యువ తరం మాత్రం అభివృద్ధిని, వికాసాన్ని కోరుకుంటు న్నారని, ఇతర దేశాలలో వలే విధ్వంసాన్ని కాకుండా వివేకవంతమైన మార్గాన్ని ఎంచుకున్నారని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. అందుకు కారణాలు ఉన్నాయి.

ఉపాధి అవకాశాలు, డిజిటల్‌ ‌విప్లవం

భారతీయ యువతరం కేవలం ఉద్యోగం కోసం ఎదురుచూసేది కాదు. ఇది వ్యవస్థాపకత (Entrepreneurship), ఆవిష్కరణలు (Innovations), ప్రపంచ వేదికపై గుర్తింపును కోరుకునే తరం. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్టార్టప్‌ ఇం‌డియా’, ‘డిజిటల్‌ ఇం‌డియా’, ‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’ వంటి కార్యక్రమాలు ఈ యువ ఆకాంక్షలకు సరిగ్గా సరి పోయే వేదికలను అందించాయి. మొబైల్‌ ‌డేటా అతి తక్కువ ధరలకు లభించడం, యూనిఫైడ్‌ ‌పేమెంట్స్ ఇం‌టర్‌ఫేస్‌ ‌ద్వారా ఆర్థికవ్యవస్థ డిజిటలై జేషన్‌ ‌కావడం, చిన్న పట్టణాలు, గ్రామాలలో కూడా వ్యాపార అవకాశాలను సృష్టించింది. మన యువత విధ్వంసంతో, విమర్శలతో సమయాన్ని వృథా చేసుకోవడానికి బదులు, నైపుణ్యాన్ని ఉపయోగించి ఆర్థికంగా ఎదగడానికి, గ్లోబల్‌ ‌మార్కెట్‌లో పోటీ పడటానికి ఉన్న మార్గాన్ని ఎంచుకున్నారు. యువత రాజకీయ అస్థిరతను కాదు, తమ కలలను సాకారం చేసే పటిష్ట ఆర్థిక వాతావరణాన్ని కోరుకుంటోంది. అందువల్ల, గత పాలనలో ఉన్న చచ్చుపడిన విధానం (Policy Paralysis) కంటే, మోదీ ప్రభుత్వ వేగవంతమైన, స్పష్టమైన ఆర్థిక సంస్కరణలను, స్వయం సమృద్ధి భారత్‌ను వారు విశ్వసిస్తున్నారు.

మహిళా శక్తికి గౌరవం, సాధికారత

ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బీజేపీకి మహిళా ఓటర్ల మద్దతు స్థిరంగా పెరగడం కనిపిస్తుంది. దీనికి కారణం ప్రభుత్వం మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా, ‘నారీ శక్తి’ (స్త్రీ శక్తి)గా, దేశాభివృద్ధిలో భాగస్వాములుగా చూడటం. ఉజ్జ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన (గృహాలు), జన్‌ధన్‌ ‌ఖాతాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ వంటి పథకాలు మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని, ఆరోగ్య భద్రతను కల్పించాయి. మెరుగైన శాంతిభద్రతల పరిస్థితి, ‘బేటీ బచావో, బేటీ పఢావో’ వంటి సామాజిక భద్రతా పథకాలు మహిళల్లో భద్రతా భావాన్ని పెంచాయి. మరుగుదొడ్ల నిర్మాణం వంటి చిన్న చర్యలు సైతం వారికి ఆత్మ గౌరవాన్ని, సామాజిక భద్రతను ఇచ్చాయి. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయంగా కాక, తమ భద్రతకు, గౌరవానికి లభించిన పూచీగా వారు భావిస్తున్నారు.

జాతీయవాదం, సాంస్కృతిక పునరుజ్జీవనం

భారతీయ యువత తమ జాతీయ గుర్తింపు, వారసత్వం పట్ల గర్వపడే స్థితికి చేరుకున్నారు. మోదీ ప్రభుత్వ జాతీయవాద భావజాలం, పటిష్ట విదేశాంగ విధానం, సాంస్కృతిక పునరుజ్జీవనం వంటి చర్యలు వారి హృదయాలను తాకాయి. ప్రపంచ వేదికపై భారత్‌ ‌స్థానం బలోపేతం కావడం, ప్రపంచ దేశాలు  గౌరవంగా చూడటం యువతకు గొప్ప ప్రేరణ. దేశీయ విలువలను కాపాడటంతో పాటు, వాటిని ఆధునికతతో అన్వయించడంలో ప్రభుత్వం  విజయం సాధించింది. ఇంతకు ముందు అదేపనిగా భారతీయ సంస్కృతి, చరిత్రల మీద జరిగిన దాడికి నేడు సరైన సమాధానం రావడం ఈ తరం గమనించింది. మూలాల పట్ల గౌరవాన్ని పెంపొందించే నాయ కత్వాన్ని స్వాగతించడం అందుకే. రాహుల్‌ ఆశించిన ‘విధ్వంసక ఉద్యమం’ లేదా దేశ వ్యతిరేక భావజాలం భారతీయ యువతకు ఆకర్షణీయంగా కనిపించక పోవడానికీ ఇదే ప్రధాన కారణం. వారు విదేశీ-ప్రేరేపిత, విధ్వంసక భావనల కంటే ‘భారత్‌ ‌ప్రథమం’ అనే ఆలోచనకు కట్టుబడ్డారు.

మౌలిక సదుపాయాల విప్లవం, అభివృద్ధి దృశ్యమానం

భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక విప్లవాత్మక మార్పు చోటు చేసు కుంటున్నది. కొత్త హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రైల్వేలు, విమానాశ్రయాలు, నగరాలలో మెట్రో విస్తరణ ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేశాయి. ఈ మౌలిక సదుపాయాల వృద్ధి సౌకర్యం కోసం మాత్రమే కాదు, ఇది పెట్టుబడులు, ఉద్యోగాలు, మెరుగైన కనెక్టి విటీకి ప్రతీక.

యువతరం తమ చుట్టూ జరుగుతున్న దృశ్యమానమైన అభివృద్ధిని చూస్తున్నారు. కేవలం హామీలను కాదు, పూర్తయిన ప్రాజెక్టులను చూస్తున్నారు. రాజకీయ విమర్శలు, ఆందోళనల కంటే, తమ ప్రయాణ సమయాన్ని తగ్గించే రహదారులను, తమ వ్యాపారానికి వేదికను ఇచ్చే అభివృద్ధిని వారు ఎంచు కుంటున్నారు. ఇది ఆచరణాత్మకమైన ఎంపిక, భావోద్వేగపూరితమైన ఆందోళన కాదు.

సంక్షేమ పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం

మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకతకు పెద్ద పీట వేసింది. జన్‌ధన్‌, ఆధార్‌, ‌మొబైల్‌ ఉపయోగించి లబ్ధిదారులకు నేరుగా ప్రయోజ నాలు చేరేలా చూడటం వల్ల మధ్యవర్తుల ప్రమేయం, అవినీతి తగ్గాయి. సమాచార యుగంలో పుట్టి పెరిగి నందున ఈ తరం పారదర్శకత,  జవాబుదారీతనాన్ని కోరుకుంటుంది. పాత పద్ధతులలోని అవినీతి, జాప్యం వారికి నచ్చవు. అందుకే, వారు తమకు నేరుగా ప్రయో జనాలను అందించే, పారదర్శకంగా పనిచేసే నాయ కత్వాన్ని ఆమోదిస్తున్నారు. ఈ పారదర్శకత, ప్రభుత్వం పట్ల వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది.

భారతీయ యువతరం, మహిళలు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారు. వారు కేవలం నినాదాలను, విమర్శలను కాదు, సంకల్పం, సంస్కరణ, సుస్థిరతలను కోరుకుంటున్నారు. బిహార్‌ ఎన్నికల ఫలితాలు యువత రాజకీయంగా పరిపక్వత చెందుతున్నదని, వివేకవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నదని స్పష్టం చేస్తున్నాయి. అంటే మన యువతరం విధ్వంసానికి కాకుండా, వికాసానికి ఓటు వేశారు. మోదీజీ నాయకత్వం ఈ యువ ఆకాంక్షలకు, జాతీయవాద భావాలకు, సాంస్కృతిక గౌరవానికి, ఆర్థిక వృద్ధికి ఒక పటిష్టమైన వారథిగా పనిచేస్తోందని భావించారు. కాబట్టి, భారతీయ యువతరం మోదీజీ ఆత్మ నిర్భర భారత్‌ (‌స్వయం సమృద్ధ భారత్‌) ఆలోచనతో ప్రపం చానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది. భారత యువత నిస్సందేహంగా దేశ భవిష్యత్తుకు భాగ్యవిధాతగా మోదీజీని చూస్తున్నారు. నరేంద్ర మోదీ వికసిత భారత్‌ ‌సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ప్రయాణించాలని ఓటుతో నిరూపించింది.

బీఎల్‌ఎన్‌ ‌పవన్‌,

‌బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, ఏపీ

About Author

By editor

Twitter
YOUTUBE