జాగృతి వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచిక కోసం సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ వాకాటి పాండురంగారావు స్మారక ‘కథల పోటీ – 2022’ నిర్వహిస్తున్నాం.

రచయితలకు ఆహ్వానం..

ప్రథమ బహుమతి   : రూ. 12000/-

ద్వితీయ బహుమతి  : రూ. 7000/-

తృతీయ బహుమతి  : రూ. 5000/-

  1. సమకాలీనం, చారిత్రకం, సైన్స్‌ ఫిక్షన్‌ ఇతివృత్తంతో కూడిన కథలను పంపవచ్చు. భారతీయ సామాజిక జీవనమే నేపథ్యంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆంగ్ల పదాలను పరిహరించండి.
  2. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఎనిమిది కథలకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహక బహుమతి, సాధారణ ప్రచురణకు స్వీకరించిన ప్రతి కథకు జాగృతి పారితోషికం ఉంటాయి.
  1. కథ నిడివి 1500 పదాలకు మించరాదు. ఒక రచయిత 3 కథలకు మించి పంపరాదు.
  2. కథ తన స్వంతమేనని, అనువాదం, అనుసరణ కాదని, బ్లాగుల్లోనూ, వెబ్‌ పత్రికల్లోనూ మరెక్కడా ప్రచురితం, ప్రసారం కాలేదని; పరిశీలనలో లేదని విడిగా హామీపత్రం జతచేయాలి. హామీపత్రంలో రచయిత పేరు, చిరునామా, ఇ`మెయిల్‌ ఐడి, ఫోన్‌ నంబర్‌ తప్పక రాయండి. కథ రాసిన పుటలలో ఎక్కడా రచయిత పేరు గానీ, ఇతర వివరాలేవి ఉండరాదు.
  1. దీపావళి సంచిక నుంచి ఆరంభించి, వరుసగా ఈ కథలను ప్రచురిస్తాం.
  2. కథలను తెలుగులో అను లేదా యూనికోడ్‌ ఫాంట్‌లో డిటిపి చేసి [email protected] కు  మెయిల్‌ చేయాలి. చేతి రాత అందంగా, న్యాయనిర్ణేతలకు అర్థమయ్యేలా ఉంటే స్కాన్‌ చేసి పంపినా పరవాలేదు. కొట్టివేతలు ఉన్నా, సరిగా స్కాన్‌ చేయకున్నా పోటీకి తీసుకోలేం.
  1. కథను పోస్టు లేదా కొరియర్‌ ద్వారా పంపాలనుకుంటే ‘కథల పోటీ’ జాగృతి వారపత్రిక, 3-4-228/4/1, జాగృతి భవన్‌, కాచిగూడ, హైదరాబాద్‌`500027 కు పంపొచ్చు. జాగృతికి కథల్ని చేర్చే బాధ్యత రచయితలదే.
  1. కథల ఎంపికలో ఉత్తర, ప్రత్యుత్తరాలకు తావులేదు. సంపాదకునిదే అంతిమ నిర్ణయం.

కథలు జాగృతికి చేరడానికి చివరి తేది : 21 సెప్టెంబర్‌, 2022

About Author

By editor

Twitter
Instagram