– గుగులోతు వెంకన్ననాయక్‌, ‌బీజేపీ రాష్ట్ర నాయకులు (తెలంగాణ)

ఒకే దేశం ఒకే ఎన్నిక (వన్‌ ‌నేషన్‌- ‌వన్‌ ఎలక్షన్‌) ‌లేదా ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ చెబుతున్న అంశం. తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు పిలుపును ఇవ్వడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. దీని సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కేంద్రం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయడం, ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కూడా కేంద్రం యోచిస్తున్నట్లు జోరుగా చర్చ మొదలు కావడంతో దేశం దృష్టి ఇటు మళ్లింది.


గతంలో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగినా, వివిధ కారణాలతో ఆ విధానం కొనసాగ లేదు. అయితే ఒకేసారి ఎన్నికలు అంత తేలికైన పని కాదు. ఇది కేంద్రానికి తెలియనిదీ కాదు. కాని సాధ్యమే. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌  ‌ప్రత్యేక సమావేశాల నిర్వహణ.  సెప్టెంబర్‌ 18 ‌నుంచి 22 వరకు పార్లమెంట్‌ ‌సమావేశాలు జరుగుతున్నాయి. పలు కీలక బిల్లులతో పాటు జమిలి ఎన్నికలకు సంబం ధించి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే జమిలీ ఎన్నికలు. అదే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వ హిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో ఆయా శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

అయితే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాని ప్రయత్నం చేస్తే సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ సవరణలకు లోక్‌సభలోని 543 స్థానాల్లో కనీసం 67 శాతం మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అటు రాజ్యసభలోని 245 సీట్లలో 67 శాతం ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలంటే 14 రాష్ట్రాలు సమర్థిస్తూ తీర్మానం చేయాలి. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు మరో 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి దాదాపు 333 సీట్ల బలం ఉంది. 543 స్థానాలకు గానూ ఈ 333 సీట్లు అంటే 61శాతానికి సమానం. మరో 6 శాతం ఓటింగ్‌ను సంపాదించడం ఎన్డీఏ కూటమికి కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అటు రాజ్యసభలో 38 శాతం సీట్లు మాత్రమే ఎన్డీఏకు ఉండటంతో అసలు ఈ జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ గతంలో ఇలాంటి పరిస్థితుల నుండి చాలా బిల్లులను పార్లమెంట్‌లో బీజేపీ నెగ్గించుకుంది.

అసలు జమిలి ఎన్నికల అవసరం ఏమిటి? రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. వేర్వేరు సమ యాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్లే ఖర్చు అత్యధి కంగా ఉంటోందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇలా ప్రజా ధనం వృథా అవుతోందని దాన్ని అరికట్టేందుకే జమిలి ఎన్నికలను తీసుకురావాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. అదే సమయంలో ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా వెచ్చి స్తోంది. వీటికి తోడు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలుచేసే ఖర్చును కూడా లెక్కపెడితే ఆశ్చర్యపోవా ల్సిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కలిపి దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేశాయని అప్పట్లో సెంటర్‌ ‌ఫర్‌ ‌మీడియా స్టడీస్‌ ‌సంస్థ తెలిపింది. దీంతో భారత దేశ చరిత్రలోనే 2019 లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి.

లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. భారీగా ప్రభుత్వ ధనం వృధా తగ్గి, ఖర్చులు కలిసి వస్తాయని భావిస్తోంది. దీంతోపాటు అధికార యంత్రాంగాన్ని కూడా సమర్థంగా ఉపయో గించుకునే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అధికారులు ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటే పరిపాలనపై ప్రభావం పడుతుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు రెండుసార్లు ఎన్నికలు జరగకుండా వారు పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు తరచూ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారడం కూడా తగ్గుతుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటర్లు ఒకేసారి వచ్చి ఓటింగ్‌ ‌వేయడం వల్ల పోలింగ్‌ ‌శాతం కూడా పెరుగుతుందని లా కమిషన్‌ ‌వెల్లడించింది.

అయితే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా కొన్ని రాజ్యాంగ సవరణలు తీసుకు రావాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను కూడా సవరించాలి. దీని కోసం రాష్ట్రాల అంగీకారం కూడా కావాలి. ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి వస్తే ప్రచారంలో జాతీయ అంశాలే అధిక ప్రాధాన్యత కలిగి, స్థానిక అంశాలు, సమస్యలు కనిపించకుండా పోతాయని ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా భయపడుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ఖర్చులో కూడా జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీపడాల్సి రావడం మరింత ఇబ్బందిగా ఉంటుందని భావిస్తున్నాయి. అయితే 2015లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమికి ఓటు వేయనున్నారని తేలింది. అసెంబ్లీకి పార్లమెంట్‌కు వేర్వేరుగా నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61శాతానికి తగ్గినట్లు వెల్లడైంది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1967 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో ఏడాది ముందే లోక్‌సభ రద్దు చేయడంతో ఈ విధానం మారి పోయింది. అయితే 1983 లో ఎన్నికల కమిషన్‌ ‌మరోసారి జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెచ్చినా ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. 1999లో లా కమిషన్‌ ‌నివేదిక ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని లేవనెత్తినా అది కూడా ఆచరణ లోకి రాలేదు.

2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జమిలి ఎన్నికల ఆలోచనను ప్రతిపా దించగా, 2017లో నీతి ఆయోగ్‌ ‌కసరత్తు చేసింది. 2019లో ఈ అంశంపై వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేయగా, కాంగ్రెస్‌ ‌సహా చాలా ప్రతిపక్షాలు హాజరు కాలేదు. అయితే 2022లో జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని సీఈసీ సుశీల్‌ ‌చంద్ర ప్రకటించారు. 2022 డిసెంబర్‌లో జమిలి ఎన్నికలపై లా కమిషన్‌ ‌వివిధ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయా లను ఆహ్వానించింది.


ఒకే దేశం ఒకేసారి ఎన్నికల అంశాన్ని పరిశీలించేందుకు న్యాయ మంత్రిత్వ శాఖ నియమించిన సంఘంలోని ఎనిమిది మంది సభ్యులు-

రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ (‌మాజీ రాష్ట్రపతి, కమిటీ అధ్యక్షుడు), అమిత్‌షా, అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధురి (తాను కమిటీలో ఉండబోనని ప్రకటించారు), గులాం నబీ ఆజాద్‌, ఎన్‌కె సింగ్‌, ‌సి. సుభాశ్‌ ‌కాశ్యప్‌, ‌హరీశ్‌ ‌సాల్వే, సంజయ్‌ ‌కొఠారి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ ‌రామ్‌ ‌మేఘ్‌వాల్‌ ‌ప్రత్యేక ఆహ్వానితునిగా సమావేశాలకు హాజరవుతారు. ఈ ప్యానెల్‌ ‌కార్యదర్శిగా న్యాయ వ్యవహారాల కార్యదర్శి నితేన్‌ ‌చంద్ర వ్యవహరిస్తారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram