మధ్యయుగాలలో ఇక్కడి పాలకుల దగ్గర పనిచేయడానికి విదేశాల నుంచి చాలామంది కుటుంబాలతో సహా వచ్చేవారు. అసఫ్‌ ‌జా వంశీకులు కూడా ఇలాగే మొగలుల కొలువులో పని చేయడానికి వచ్చినవారే. వీరు సైన్యంలో లేదా ప్రభుత్వంలో పనిచేసేవారు. గుజరాత్‌ ‌పాలన వ్యవహారాలలో ఉద్యోగిగా ఉన్న అసఫ్‌ ‌జా తాత 1687లో గోల్కొండ ముట్టడికి వచ్చినప్పుడు ఆయన తాత కన్నుమూశాడు.వీరికంటే ముందు పాలించిన కుతుబ్‌ ‌షాహీల కథ కూడా ఇలాంటిదే. నిజాం వద్దకు ఇంత అపార ధనరాశులు అనేక మార్గాలలో వచ్చి చేరాయి. వారసత్వంగా వచ్చిన సంపద కొంత. భూమి కొంత. ప్రభుత్వం ఇచ్చేది, ఆభరణాలు- రకరకాలుగా సంపద చేరేది. వీటన్నిటికి మించిన పెద్ద సంపద ‘నజర్‌’. అం‌టే అధికారులు, తాబేదారులు, సామంతులు చెల్లించుకునే కానుకలు. అసఫ్‌ ‌జా వంశానికి చేరిన ఈ సంపద యావత్తు ఈ ప్రాంతానిది లేదా దేశానిదే.

నిజాం ఆస్తుల గురించి లెక్కలు తేలాయని ఇప్పటికీ  చెప్పలేం. అవి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తాయో అంచనాకు అందదు. ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ను ప్రపంచ ధనికులలో ఒకనిగా అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించడం రూఢి అయిన తరువాత ఆ  వార్తను సేకరించడానికి 1946లో ‘లైఫ్‌’ ‌మ్యాగజీన్‌ ‌తరఫున ఇక్కడికి వచ్చిన మార్గరెట్‌ ‌బర్క్ ‌వైట్‌ ‌కూడా నిజాం ఆస్తుల గురించి రాశారు. ఆమె అమెరికా ఫొటో జర్నలిస్ట్. ‌నిజాం సహా చాలామంది భారత ప్రముఖులను ఆమె ఇంటర్వ్యూ చేశారు. భారత్‌లోనే నిజాం అతి పెద్ద భూస్వామి అని ఆమె రాశారు. భారతదేశంలోనే అతి పెద్ద సంస్థానమిది. ఇందులో 15 వంతులలో ఒక వంతు నిజాం సొంత ఆస్తిగా ఉండేదని తెలియచేశారు. దీని వైశాల్యం 81,698 చదరపు మైళ్లు. సంస్థానం మీద వచ్చిన ఆదాయంలో 15 శాతం నిజాం సొంతమయ్యేది. తన ఇద్దరు కుమారుల కోసమని ఖజానా నుంచి ఇంకొంత ధనం వచ్చేది. ఇదంతా కలిపి కోట్ల రూపాయలలో ఉండేది. అయితే నాడు ఐదో జార్జ్, ఆయన కుటుంబం అంతా కలసి బ్రిటన్‌ ఆదాయంలో 0.091 శాతమే తీసుకునేవారు. తమ ఆభరణాలెన్నో నిజాంకే తెలియదు. ఆయన దగ్గర ఉన్న ముత్యాలెన్నో కొలతకు అందవు. బంగారం నిల్వ చేయడానికి ఇనప్పెట్టెలు చాలేవి కాదు. ఇవన్నీ బర్క్ ‌వైట్‌ ‌రాసిన విషయాలు. జానపద కథలలో ధనరాశుల వర్ణనను పోలినట్టు ఉన్నా, ఇవన్నీ నిజాలే. ముంబయ్‌కి చెందిన జర్నలిస్ట్ ‌డీఎఫ్‌ ‌కరాకా కూడా కొన్ని విషయాలు రాశారు. నిజాం ఆర్థిక పరిస్థితి గురించి ఆయన అధ్యయనం చేశారు. ఈయన కూడా నిజాం వ్యక్తిగత ఆస్తి విలువ వంద మిలియన్‌ ‌పౌండ్లని లెక్క గట్టారు. ఇందులో 25,500,000 పౌండ్లు ధనరూపంలో దగ్గరే ఉండేది. ఆభరణాల విలువ 35,000,000 పౌండ్లు. లండన్‌ ‌టైమ్స్ ‌ఫిబ్రవరి, 1967లో ఇచ్చిన వివరాల ప్రకారం (సంస్మరణ వ్యాసంలో) వార్షికాదాయం 2,500,000 పౌండ్లు. 150 మంది ఒకేసారి భోజనం చేయడానికి కావలసిన పాత్రలు -అంతా బంగారం- ఉండేవి. 1963లో కేంద్ర ప్రభుత్వం బంగారం మీద నియంత్రణ విధించింది. ఆ సమయంలో నిజాం వారసుడు ముఖరమ్‌ ‌జా తన వద్దనే 22 టన్నుల బంగారం ఉందని ప్రకటించాడు. ఒక సమయంలో కింగ్‌ ‌కోఠి భవనం పైన ముత్యాలన్నీ పరచగా మొత్తం నిండిపోయిందని చెబుతారు.

నిజాం చేతిలో ఉన్న భూమి వివరాలు తెలుసుకుంటే కళ్లు చెదురుతాయి. నిజాం సంస్థానం వైశాల్యం 81698 చదరపు మైళ్లు. సంస్థానంలో గ్రామాలు 22457. ఇవి మూడు రకాలు. మొదటి రకం సెర్ఫ్ ఎ ‌ఖాస్‌. ఇవి 1961 గ్రామాలు. ఇవన్నీ పాలక కుటుంబాల ఆస్తులు. అసలు ప్రభుత్వానికి చెందిన భూములలో 10 శాతం ఈ రకానికి చెందినవే. వీటి మీద ఆదాయం మొత్తం రాచకుటుంబానిదే. ఇది 55 లక్షల ఎకరాల సాగు భూమి. వీటి నుంచి 25 మిలియన్‌ ‌రూపాయల వార్షికాదాయం వచ్చేది. కానీ ఈ భూములు జాగీర్లతో పోల్చుకుంటే దుస్థితిలో ఉండేవి. ఇది కాకుండా ఏటా రూ. 70,00,000 రాష్ట్ర ఖజానా నుంచి అందేవి. సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించిన తరువాత నెలకు రూ.50,00,000 భూములకు నష్టపరిహారంగా, మరొక రూ. 50,00,000 రాజ భరణంగా ఏటా లభించేది. వీటిలో దేనికీ ఆదాయపు పన్ను లేనేలేదు. నిజాం ఇంత భారీగా ఆదాయం పొందినప్పటికీ సెర్ఫ్ ఎ ‌ఖాస్‌ ‌గ్రామాలు అత్యంత వెనుకబడి ఉండేవి. రెండోరకం గ్రామాలలోనే పైఘా, సంస్థాన్‌, ‌జాగీర్‌, ‌దేశ్‌ముఖ్‌ల భూములు. ఇందులో పైఘా రకం భూములు నిజాం బంధువులు, సన్నిహితులవి. ఈ గ్రామాల సంఖ్య 6535. భూ ఆదాయమంతా వీళ్ల చేతులలోనే ఉండేది. ఆఖరికి ఖల్సా లేదా దివానీ భూమి. ఈ భూమి ఉన్న గ్రామాలు 13961. అప్పుడు ఆస్తి పన్ను ఎక్కువ.

అసఫ్‌ ‌జా వంశీయులు అంటే, ఆఖరి నిజాం వద్ద ఆభరణాల గుట్టలే ఉండేవి. అవన్నీ మొగలులు, కాకతీయులు, విజయనగర పాలకులు, ఖాందేష్‌, అహ్మద్‌ ‌షాహి, నిజాం షాహి, బరీద్‌ ‌షాహి, కుతుబ్‌ ‌షాహీ పాలకుల నుంచి వచ్చినవే. ఆఖరి నిజాం 1911లో అధికారంలోకి వచ్చిన నాటికి జాకబ్‌ ‌వజ్రం సహా ఎన్నో విలువైన ఆభరణాలు, నవరత్నాలు ఉండేవి. ఆఖరి నిజాం వీటి రక్షణకు మూడు ట్రస్ట్‌లు ఏర్పాటు చేశాడు. మొదట కింగ్‌కోఠిలోని రాజ ప్రాసాదంలోనే ఉంచినా తరువాత బొంబాయిలోని మెర్కంటయిల్‌ ‌బ్యాంక్‌లో దాచారు. తాను మరణించిన తరువాత అందులో రెండు ట్రస్ట్‌లలోని ఆభరణాలను కుటుంబ సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలని వీలునామా రాశాడు.

నజర్‌ ‌పేరుతో నిజాం గుంజుకున్న డబ్బు, వస్తువుల విలువ అసాధారణమైనది. ఇది మొగల్‌ ‌దర్బారు సంప్రదాయం. దీనినే నిజాం కొనసాగించాడు. ప్రభుత్వ అధికారులు, సైనికాధికారులు, పైఘాలు, జాగీర్దార్లు వారి వారి సామాజిక హోదాను బట్టి నజర్‌ ‌విలువ ఆధారపడి ఉండేది. ఈద్‌ ‌పండుగకు, నిజాం జన్మదినానికి ప్రతి ఉన్నతాధికారి నజర్‌లు సమర్పించుకోవలసి ఉండేది. కనీస నజర్‌ ఎం‌త? ఒక బంగారు నాణెం లేదా నాలుగు వెండి నాణేలు. అయితే ఈ నాణేలు మామూలుగా చెలామణిలో ఉండేవి మాత్రం కాదు. నజరానా పేరుతో ఇచ్చే ఈ నాణేలు ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌కాలంలోనే ఎక్కువగా ముద్రించారు. అలాగే ఇవి జేబులో వేసుకుని తీసుకవెళ్లేవి కూడా కాదు. రెండువందల గ్రాముల బరువు నుంచి ఉండేవి. నజర్‌ ‌పేరుతో ఇచ్చే నాణేలను వేరేగా తయారుచేయించేవారు. నాణేలే కాకుండా రత్నాలు, పచ్చలు వంటి జాతి రాళ్లు, గుర్రాలు, ఏనుగులు, దుస్తులు , ఆయుధాలు కూడా నజర్‌ ‌రూపంలో చెల్లించేవారు. సంస్థానం బయటివారికి కూడా ఇది తప్పేది కాదు. ఒకసారి మౌలానా జఫార్‌ అలీ అనే పండితుడు నిజాంను వచ్చి కలిశాడు. మూడుసార్లు సలాం చేశాడు. కానీ నజర్‌ ఏం ‌లేదు. దీనితో నవాబు అలీ నజర్‌ ఏది? అని అడిగాడని చరిత్రకారులు చెబుతారు. 1965 నాటి పాక్‌ ‌యుద్ధ సమయంలో నిజాం కేంద్ర ప్రభుత్వానికి 33,000 బంగారు నాణేలు ఇచ్చాడంటేనే ఆయన సంపద ఎంతో అర్ధమవుతుంది.

పాకిస్తాన్‌లో చేరడానికి మొగ్గు చూపిన నిజాం మొదట్లో ఆ దేశ ప్రభుత్వం కోసం రూ. 20 కోట్లు సమర్పించాడు. నిజాం దక్కన్‌ ఎయిర్‌వేస్‌ ‌ద్వారా బంగారం గుట్టలను చేరవేయించాడు. 1918లో టర్కీ ఒట్టోమన్‌ ‌రాజ్యం పతనమైన తరువాత పాలకుడు రెండో మాజిద్‌కు నెలకు 300 పౌండ్లు వంతున నిజాం పింఛన్‌ ఏర్పాటు చేశాడు.

ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ ‌దేమె రాజారెడ్డి, సమీక్ష దేమె పుస్తకం ‘మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ అం‌డ్‌ ‌హిస్‌ ‌వెల్త్’‌లో నిజాం ఆస్తుల గురించి అద్భుతమైన వివరణ ఉంది. భూములు, ఆభరణాలు, వజ్రవైఢూర్యాలను అక్షరాల మేటలు వేయించారు నిజాం ప్రభువులు. ప్రభువుల భోగాలకు పోయినంత పోగా మిగిలిన సంపద ఇది. భృత్యులు, బంధువులు కొల్లగొట్టినంత కొల్లగొట్టగా నేటికి కనిపిస్తున్న కనకరాశులు ఇవి. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సేకరించిన ఆ సమాచారంలోని కొన్ని అంశాలు:

About Author

By editor

Twitter
Instagram