ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్‌ ‌హింసతో అట్టుడికిపోతోంది. చాలా మంది ప్రాణాలు కాపాడు కోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. షరా మామూలుగానే కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని తీవ్రంగా విమర్శి స్తున్నాయి. బీజేపీ గట్టిగా ఖండిస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెట్టి నిష్పక్షపాతంగా మణిపూర్‌ ‌సమస్యను అధ్యయనం చేస్తే ఎన్నో భయంకరమైన కుట్రలు జరిగిన, జరుగుతున్న సంగతి తెలుస్తుంది.

మణిపూర్‌కు ఆ పేరు రావడానికి కారణం అక్కడ విలువైన మణులు దొరకడమే కారణమట. అర్జునుడి భార్యల్లో ఒకరైన చిత్రాంగద పుట్టింది మణి పూర్‌లోనే. వారి కుమారుడు బబృవాహనుడు మణిపూర్‌ను పాలించాడని పురాణాలు చెబుతాయి. ఇక్కడి హిందువులు వైష్ణవ పరంపరకు చెందినవారు.

కానీ 19వ శతాబ్దంలో ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు ప్రవేశించాయో అప్పటి నుండి అక్కడ అవాంఛనీయమైన మార్పులు మొదలయ్యాయి. 1894లో ఇంగ్లాండుకు చెందిన విలియం పెట్టిగ్రు అనే క్రైస్తవ మిషనరీ మణిపూర్‌ ‌వచ్చాడు. ఆయన అర్థింగ్టన్‌ అబారిజిన్స్ ‌మిషనరీ గ్రూప్‌కు చెందిన వాడు. అంతవరకూ అక్కడ అమెరికన్‌ ‌బ్యాప్టిస్ట్ ‌ఫారిన్‌ ‌మిషన్‌ ‌సొసైటీ మత మార్పిడులు చేస్తుండేది. పెట్టిగ్రు కూడా బ్యాప్టిస్ట్‌గా మారి మతమార్పిడులను వేగవంతం చేశాడు.

మణిపూర్‌ ‌ప్రధానంగా రెండు ప్రాంతాలు. ఒకటి లోయ, రెండు కొండ. లోయలో హిందువులు ఉంటారు. కొండలలో ఆదివాసీలు ఉంటారు. వీరిలో కుకీలు ముఖ్యమైనవారు. మొదట వీరు సామ రస్యంగా ఉండేవారు. ఇరు వర్గాల మధ్య పెళ్లిళ్లు కూడా జరిగాయి. పెట్టిగ్రు మొదట హిందువులను మతం మార్చేందుకు ప్రయత్నం చేశాడట. హిందు వులు సాగనివ్వలేదు. దాంతో కొండ ప్రాంతమైన యూకృల్‌ ‌వెళ్లి, ఒక బడిని, ఆసుపత్రిని ప్రారంభిం చాడు. పెట్టిగ్రు బైబిల్‌ను స్థానిక మాండలికం తంగకుల్‌లోకి అనువదించాడు కూడా. సేవ, విద్య పేరుతో ఆదివాసులను ఆకట్టుకొన్నాడు. కుకీలు ఆయనను పూర్తిగా నమ్మారు. తరువాతి రోజుల్లో అక్కడికి వాటికిన్‌ ‌రాబర్ట్, ‌యు.ఎం.ఫాక్స్, ‌డా.జి.జి. క్రోజియర్‌ అనే క్రైస్తవ మత ప్రచారకులు వచ్చారు.

వాళ్లకు పెద్ద ఎజెండా ఉంది. ఆదివాసుల జీవన విధానం, ఆరాధన పద్ధతులు, వస్త్రధారణ అన్నీ అనాగరికమైనవనీ, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు, హిందూమతంలో అంతమంది దేవుళ్లు ఎలా ఉంటారనీ, ఆదివాసుల మనసుల్లో అనుమా నాలు, అపోహలు నాటారు. దానితోపాటు అంత వరకూ కలిసి ఉన్న ఆదివాసులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొనేలా చేశారు. ఇంత చేసినా మతం మారిన హిందువుల సంఖ్య వందలకే పరిమితం అయింది. 1911 సంవత్సరానికి మతం మారిన హిందువులు అతికొద్దిగానే ఉన్నా, ప్రతి గ్రామం లోనూ చర్చిలు మాత్రం పుట్టుకొచ్చాయి. ‘‘మేము ఇపుడు విత్తనాలు నాటాము. దీని ఫలాలు మీరు భవిష్యత్తులో చూస్తారు’’ అనేవాడట పెట్టిగ్రు. 1914లో మొదలయిన మొదటి ప్రపంచయుద్ధం మొత్తం పరిస్థితిని మార్చేసింది. ఇంగ్లాండ్‌ ‌తరపున యుద్ధం చేయడానికి కుకీలను బ్రిటిష్‌ ‌ప్రభుత్వం రిక్రూట్‌ ‌చేసుకోవడానికి ప్రయత్నంచేస్తే వారు తిరగబడి, గెరిల్లా పోరాటం చేశారు. వారి పోరాటం చూసి ఆంగ్లేయులు బిత్తరపొయారు. రెండు సంవత్స రాలు పోరాడినా చివరకు కుకీలు ఓడిపోయారు. అక్కడి నుండి ఈశాన్య ప్రాంతంలో బ్రిటిష్‌ ‌ప్రాబల్యం పెరిగింది. బెదిరించి మరీ మతాన్ని మార్చారు.

నెహ్రు-ఇర్విన్‌ ‌విధానం మణిపూర్‌ ‌చరిత్రలో ఒక మైలురాయి. ఆదివాసీలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం, వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయడం అనే అందమైన మాటలు చెప్పి క్రైస్తవ మిషనరీలను ఆ ప్రాంతంలోకి అనుమతించి, హిందువులను దూరంగా ఉంచారు. ఫలితంగా మిగిలిన దేశం అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుంటే, ఈశాన్యం మాత్రం చర్చిలు, బైబిళ్లతో సరిపుచ్చుకుంది. ఇదెక్కడికి దారి తీసిందంటే, 1951లో 12 శాతం ఉన్న క్రైస్తవులు 1961కి 20 శాతానికి పెరిగారు. బర్మాలో ఉన్న కుకీలను కూడా రప్పించారు. ఫలితంగా మతం మారిన కుకీలు, ఇతర ఆదివాసుల సంఖ్య 41 శాతానికి చేరింది. మతం మారి క్రైస్తవులైన కుకీలకు ST హోదా కల్పించి, హిందువులకు మాత్రం కేవలం OBC హోదా మాత్రమే ఇచ్చారు. ఈ హిందువులు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి నివాసం ఉండకుండా నిషేధం విధించారు. దాంతో హిందువులు కేవలం 10శాతం భూభాగం కలిగిన ఇంఫాల్‌ ‌లోయకే పరిమిత మయ్యారు. అదే సమయంలో మతం మారిన కుకీలు లోయ ప్రాంతంలో కూడా నివసించే వీలు కల్పించారు. మతం మారిన కుకీలు రాష్ట్రంలో ఎక్కడైనా భూమిని కొనవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్లదే సింహ భాగం. అంతేకాదు, American Baptist Churches నుండి నిధులు ప్రవహిస్తు న్నాయి. ఈ డబ్బుతో కుకీలు ఆయుధాలు కొనుగోలు చేసి మణిపూర్‌లో హిందువులను గుర్తించి మరీ తరిమిగొడుతున్నారు. ఈ కుకీలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండు చేస్తున్నారు.

రాజ్యాంగంలోని 25వ అధికరణ మైనారిటీలు తమ మతాన్ని ప్రచారం చేసుకునే వీలు కల్పిస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని మైనారిటీ మతాలు యథేచ్ఛగా మత ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడ మైనారిటీ మతాల జనాభా పెరుగుతున్నదో అక్కడ దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు, వేర్పాటువాదం ప్రబలుతున్నాయి.

ప్రపంచంలోని ఏ దేశంలో కూడా తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆ దేశ రాజ్యాంగం వీలు కలిగించదు. ఈ దిక్కుమాలిన స్వేచ్ఛ ఈ దేశంలోనే ఉంది! రాజ్యాంగ సభ సభ్యుడు లోకనాథ్‌ ‌మిశ్రా మత ప్రచారం చేసుకొనే హక్కును మౌలిక హక్కుగా చేర్చరాదని, అది లౌకికరాజ్య లక్షణం కాదని ఆనాడే గట్టిగా వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది.

ఈనాడు మణిపూర్‌లో జరుగుతున్న దారుణ హింసాకాండకు భారతదేశంలోని చర్చిలు, విదేశా ల్లోని చర్చిలు సైద్ధాంతికంగా, ఆర్థికంగా, ఆయుధ పరంగా సంపూర్ణమైన మద్దతును ఇస్తున్నాయి. హిందువులు మతంమారి క్రైస్తవులు అయితే ఏంటి నష్టం? అని అడిగేవారు ఈరోజు మణిపూర్‌ ఎలా ఉందో చూడాలి. ఇలానే వదిలేస్తే దేశంలో ఇంకొన్ని మణిపూర్లు తయారవుతాయి.

– గుగులోతు వెంకన్న నాయక్‌, ‌బీజేపీ నాయకుడు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram