రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. 1925లో నాగపూర్‌లో సంఘ్‌ ‌స్థాపన జరిగింది. ఈ సంవత్సరం (2022) విజయదశమి నాటికి సంఘ్‌ ‌ప్రారంభమై 97 సంవత్సరాలు పూర్తవుతాయి. సంఘ్‌ ‌కార్యం ఏ ఒక్కరి కృషితో జరగలేదు. కార్యకర్తల కృషి, త్యాగం, బలిదానాల మూలంగా, నానాటికీ పెరుగుతున్న సామాజిక మద్దతు, పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల సంఘకార్యం పెరుగుతున్నది. అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తున్నది. ఈ కారణంగానే అంతటా సంఘ్‌ ‌గురించిన చర్చ జరుగుతున్నది. సంఘ్‌ ‌తన శతాబ్ది వేడుకలను ఎలా జరుపుకుంటుందనే ఆసక్తి సైతం ప్రజల్లో నెలకొంది.

సంఘ్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌దృష్టి చాలా స్పష్టమైనది. సంఘ్‌ ‌సమాజంలో ఒక సంస్థ మాత్రమే కాదు. యావత్‌ ‌సమాజాన్ని సంఘటితం చేసేది. భావనాత్మకంగా సంఘ్‌, ‌హిందూ సమాజం మధ్య సమన్వయం (conceptually RSS and Hindu society are co-terminus) ఉంటే, మనోవైజ్ఞానిక దృష్టి కోణంలో ఒకటేనని (psychologically they are one) సంఘ్‌ ‌జ్యేష్ఠ కార్యకర్త దత్తోపంత్‌ ‌ఠేంగ్డి అన్నారు.

ఈ కారణంగానే సంఘ్‌ ‌శతాబ్ది వేడుకలు నిర్వహించాలనే ఆలోచనకు తావులేదు. సంఘ్‌ ఒక సంపూర్ణ సమాజం. సంఘ్‌ ‌సాధనను సమాజమంతటా విస్తరింపజేయడమే లక్ష్యంగా ఉండాలి. సంఘ్‌ ‌రజతోత్సవం సైతం జరుపుకోరాదని డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌చెబుతుండేవారు. అంతకుమునుపే కార్యాన్ని పూర్తి చేయాలనే ఆశయంతో పూర్తి శక్తియుక్తులతో నిమగ్నమయ్యారు.

కానీ వారికి కేవలం 15 సంవత్సరాల సమయం మాత్రమే లభించింది. కనుక శతాబ్ది సంవత్సరానికి ముందే సంఘ్‌ ‌కార్యాన్ని పూర్తి చేయడమే లక్ష్యం అయిఉండాలి. ‘‘కార్యమగ్నత జీవన్‌ ‌హో ఔర్‌ ‌కార్యపూర్తీ హీ విశ్రాంతి’’ (పనిలో నిమగ్నం కావడమే జీవితం, కార్యాన్ని పూర్తి చేయడమే విశ్రాంతి) అని ఒక సంఘ గీత్‌ (‌పాట) ఉంది.

సంఘ్‌ ‌కార్య విస్తరణ యాత్రలో నాలుగు దశలు ఉన్నాయి. సంఘ్‌ ‌స్థాపన నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు మొదటి దశ. ఈ దశలో ఏక చిత్తంతో, ఏకాగ్రతతో సంఘటన పైన మాత్రమే దృష్టి ఉంది. ఎందుకంటే హిందూ సమాజం సంఘటిత మవుతుంది, అడుగులో అడుగువేసి ఒకే దిశలో ఏకథాటిగా నడవగలదు, ఒకే మనస్సుతో, ఒకే స్వరంతో భారత్‌ ‌గురించి, హిందుత్వ గురించి మాట్లాడగలము అనే ఒక విశ్వాసాన్ని పాదుగొల్పడం అప్పుడు ముఖ్యం. ఆ లక్ష్యం కోసమే యావత్‌ ‌కార్యం సాగింది. ఆ సమయంలో ఎవరికి వారే స్వచ్ఛందంగా వ్యక్తిగత స్థాయిలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. సమాజ సంస్కరణ, తదితర ఉద్యమాల్లో పాలుపంచు కుంటున్నారు. కానీ సంఘ్‌ ‌తన పూర్తి దృష్టిని హిందూ సంఘటన పైనే కేంద్రీకరించింది.

వెయ్యి సంవత్సరాల నిరంతర సంఘర్షణ తర్వాత ‘స్వ’ ప్రేరణగా కొనసాగిన స్వరాజ్య ఉద్యమం ఆధారంగా విద్య, విద్యార్థి, రాజకీయం, కార్మికులు, వనవాసీ సమాజం, వ్యవసాయం తదితర రంగాల్లో భారతదేశపు శాశ్వతమైన జాతీయ దృక్పథానికి ప్రేరణ చెంది వివిధ సంస్థలు ఆవిర్భవించాయి. అదే సమయంలో సంఘటన కార్యం కొనసాగింది. కానీ దానితో పాటుగా సంపూర్ణ సమాజ జీవనాన్ని విస్తరింపజేసే అనేక సంస్థలు ఆరంభమయ్యాయి.

నేడు సంఘ్‌ ‌కార్యకలాపాలు శాఖ రూపంలో 90 శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో చురుకుగాను, సమర్థవంతంగానూ పనిచేస్తున్నాయి.

సంఘ్‌ ‌కార్యకలాపాల అభివృద్ధి యాత్రలో మూడవ దశ డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌జయంతి శతాబ్దిని పురస్కరించుకొని 1990లో ఆరంభమైంది. యావత్‌ ‌సమాజం ఆత్మీయత, ప్రేమ ప్రాతిపదికన సంఘటితం కావాలి. అందుకు సమాజంలో వంచితులు, దుర్బలులు, వెనుకబడిన వర్గాలు, కనీస సౌకర్యాలకు నోచుకోకుండా జీవించే వారికి చేరువై వారికి సహాయం, సేవ చేయడాన్ని ఒక బాధ్యతగా భావించి, వారి సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 1990లో సేవా విభాగ్‌ ఆరంభ మయ్యింది.

‘‘దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌లో స్వయంసేవక్‌ను అయ్యాను’’ అనే ప్రతిజ్ఞను స్వయంసేవక్‌ ‌చేస్తారు. ఈ సర్వతో ముఖాభివృద్ధి కార్యాన్ని కేవలం స్వయంసేవకులు మాత్రమే చేయడం లేదు. వారితో మాత్రమే అది సాధ్యం కాదు. సమాజంలోని అనేక మంది ప్రభావశీలురు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఆకాంక్షించేవారు స్వచ్ఛందంగా చేస్తున్నారు. వారి గురించి, వారు చేస్తున్న పనుల గురించి సంఘ్‌కు తెలియదు. అలాగే సంఘ్‌ ‌జాతీయ భావజాలం వారి దాకా చేరడంలేదు.

సమాజంలో అలాంటి ప్రభావశీలుర లక్షణాలు, వారి క్రియాశీలత, వారు సాధించిన విజయాలు, సమాజం నుంచి వారికి సహకారం, తదితర సమాచార సేకరణకు, సంఘ్‌ ‌భావజాలం, కార్యకలాపాల గురించిన సమాచారాన్ని వారికి చేరవేసే దిశగా 1994లో సంపర్క్ ‌విభాగ్‌ ‌కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. సంపర్క్ ‌విభాగ్‌ ‌ద్వారా కొత్తగా పరిచయమైన వ్యక్తులు సంఘ్‌లో చేరకపోవచ్చు కానీ సంఘ్‌ ‌స్వయంసేవకులుగా మేము వారిని కలుస్తాము.

పరస్పర ఆలోచనలు, అనుభవాలు, విజయాలను పంచుకోవడం ద్వారా భావ సారూప్యత కలిగిన విషయాలతో మేము వారితో కలసికట్టుగా పనిచేస్తాము.

1967లో తొలిసారిగా మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాల శాసనసభల్లో క్రైస్తవ మత మార్పిడిని అరికట్టేందుకు ఒక బిల్లు ఆమోదం పొందింది. ఆ సమయంలో కేంద్రంలో, ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉంది. అనంతరం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన కాలంలో వేర్వేరు రాష్ట్రాల శాసనసభల్లో క్రైస్తవ మత మార్పిడిని అరికట్టే బిల్లు ఆమోదం పొందింది. ఇందులో హిమాచల్‌ ‌ప్రదేశ్‌కు కొంతవరకు మినహాయింపు ఉంది. 2006లో వీరభద్రసింగ్‌ ‌నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఈ మతమార్పిడికి వ్యతిరేకంగా ఒక బిల్లును ఆమోదింపజేసింది. కొన్ని సంవత్సరాల క్రితం సంఘ్‌కు చెందిన సంపర్క్ ‌విభాగ్‌ ‌లో అధికారి వీరభద్రసింగ్‌ను కలుసుకోవడానికి వెళ్లారు. ఆ సందర్భంగా తమ ప్రభుత్వం ఉన్న కాలంలో మత మార్పిడిని వ్యతిరేకించే బిల్లు ఆమోదం పొందిన వైనాన్ని వారు స్వయంగా వివరించారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌కు వెలుపల భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా మతమార్పిడిని అడ్డుకోవడంలో తన అవసరం ఉన్న పక్షంలో కూడా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని వారు తెలిపారు. 2008 – 09 మధ్యకాలంలో గో-గ్రామ యాత్ర మొదలైనప్పుడు అనేక ప్రాంతాల్లోని సర్వోదయ కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. అన్ని విషయాల్లోనూ సంఘ్‌ ‌భావజాలం, దృక్పథంతో ఏకీభవించకపోయినా వారు సైతం అంశాలవారీగా సంఘ్‌ ‌కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు.

అదేవిధంగా వివిధ ప్రసార మాధ్యమాలను వినియోగించడం ద్వారా సంఘ్‌ ‌జాతీయ భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేయడం కోసం, సంఘ్‌పై జరుగుతున్న దుష్ప్రచారానికి దీటుగా జవాబు చెప్పడం కోసం, సంఘ్‌కు చెందిన సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం, స్వయంసేవకులు పెద్ద ఎత్తున చేపడుతున్న సత్కార్యాలను ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమాజానికి తెలియపరిచే ఉద్దేశంతో 1994లో ప్రచార్‌ ‌విభాగ్‌ (‌ప్రచార విభాగం) ఆరంభమయ్యింది. ప్రసార మాధ్యమాన్ని, ప్రజలకు సంబంధించిన అన్ని మాధ్యమాలను ఉపయోగించుకోవడానికి తోడు స్వయంగా ప్రయోగించడం ద్వారా సంఘ్‌ ‌ప్రచార్‌ ‌విభాగ్‌ ‌చురుకుగా పనిచేస్తున్నది. సంఘ్‌కు చెందిన ఈ మూడు కార్య విభాగాలు (సేవ, సంపర్క్, ‌ప్రచార్‌) ‌సుదూర ప్రాంతాల ప్రజలకు సంఘ్‌ను చేరవేయడం ద్వారా సమాజాన్ని మేల్కొలిపే కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

ఇదే సమయంలో కొన్ని సమస్యలపైన తక్షణం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ద్వారా సమాజంలో పరివర్తన తీసుకువచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ‘‘ధర్మజాగరణ్‌ ‌విభాగ్‌’’ (‌ధర్మజాగరణ విభాగం) ద్వారా హిందూ సమాజాన్ని మతమార్పిడి గావించే దిశగా ప్రణాళికాబద్ధంగా జరిగే ప్రయత్నా లను అడ్డుకోవడంతో పాటుగా, మతాంతరీకరణకు గురైన ప్రజలకు తిరిగి వారిదైన సంస్కృతిలోకి చేరడానికి సులభమైన మార్గాన్ని చూపే కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వంపై ఆధాపడకుండా ప్రజలందరూ కలిసికట్టుగా వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా గ్రామ సర్వతోముఖా భివృద్ధి లక్ష్యంగా ‘‘గ్రామ్‌-‌వికాస్‌’’ (‌గ్రామాభివృద్ధి) కార్యక్రమం ఆరంభమైంది.

ఏకత్వంతో కూడుకున్న మన హిందూ సమాజం వివిధ కులాలతో కూడినది. అయితే కుల విద్వేషాలను పెంచడం ద్వారా కొన్ని అంతర్గత శక్తులు సమాజాన్ని కుల విభేదాలతో చీల్చే పని కూడా చేస్తున్నాయి. సామాజిక సద్భావన సమావేశాల ద్వారా, ప్రతి ఒక్కరూ ఒకచోట కూర్చొని కొన్ని సాధారణ సమస్యలు, సవాళ్ల గురించి ఆలోచించేలా, వాటిని అధిగమించడానికి సమష్టిగా కృషి చేయాలనే ఉద్దేశ్యంతో ‘‘సామాజిక్‌ ‌సద్భావ్‌’’ (‌సామాజిక సద్భావన) పేరిట వరుస సమావేశాలు ప్రారంభ మయ్యాయి.

మన సమాజంలోని అంటరానితనం పేరిట కొన్ని వర్గాలకు విద్య, సౌకర్యాలు, గౌరవ మర్యాదలు దురుదృష్టవశాత్తూ నిరాకరించిన మాట నిజం. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని నివారించి, మన సమష్టి వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ అందరిని కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా ‘‘సామాజిక్‌ ‌సమరసత’’ (సామాజిక సమరసత) పని మొదలైంది.

దేశీ గోవుల నుంచి మనం పొందే ఉత్పత్తుల్లో ఔషధీయ విలువల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, భారతీయ గోవుల సంరక్షణ, సంవర్ధన, అభివృద్ధితో పాటుగా ఆవుపేడ ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేపట్టే దిశగా రైతులకు శిక్షణ, పర్యవేక్షణ, ప్రోత్సహించడం కోసం ‘‘గోసేవ-గోసంవర్ధన్‌’’ ‌కార్యక్రమం కూడా విజయవంతంగా సాగుతున్నది. భారతదేశమంతటా వేలాది సంఖ్యలో గోశాలలు ఆరంభమయ్యాయి.

భారతీయ సంస్కృతి, పరంపరంలో కుటుంబం పాత్ర అత్యంత విశిష్టమైనది. సమాజం అత్యంత ప్రాథమిక స్థాయి వ్యక్తి నుంచి మొదలవుతుందని పాశ్చాత్య దృక్పథం భావిస్తుంది. కానీ భారతీయ దృక్పథానికి సంబంధించి అది కుటుంబం నుంచి ఆరంభవుతుంది. భారతీయ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ‘‘నేను నుంచి మనం వరకు సాగించే ప్రయాణంలో’’ కుటుంబానిది తొలి అడుగు. ప్రస్తుతం పట్టణీకరణ వల్ల, జీవనంలోని హడావిడి కారణంగా కుటుంబాలు చిన్నబోయాయి. అందరూ కలిసి కూర్చుని తమ వారసత్వం, సంప్రదాయాలు, సంబంధాలు, పండుగలు మొదలైన వాటి గురించి చర్చించు కోవడానికి కూడా సమయం దొరకడం లేదు. కనుక కనీసం వారానికి ఒకసారైనా కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చోవాలి. తమ జాతీయ వారసత్వం, సంప్రదాయం, సాంస్కృతిక, వర్తమాన సామాజిక పరిస్థితులను జాతీయ దృక్కోణంతో విశ్లేషించాలి. అలా విశ్లేషించగా వచ్చిన వికాసంలో తమ కర్తవ్యాన్ని చర్చించుకోవాలనే ఉద్దేశ్యంతో ‘‘కుటుంబ్‌ ‌ప్రబోధన్‌’’ ‌కార్యక్రమం ప్రారంభమైంది.

సృష్టి మనది, సమస్త జీవులకు మాతృమూర్తి. కానీ భౌతిక జీవన ప్రభావం వల్ల ప్రకృతి దోపిడీకి గురైంది. పశ్చిమ దేశాల అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కొనసాగుతున్న అభివృద్ధి కేవలం 500 సంవత్సరాలలోనే సృష్టి సంతులతను దెబ్బ తీసింది. ప్రజల భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడం ద్వారా దెబ్బతిన్న సంతులతను పునరుద్ధరించడానికి, ‘‘పర్యావరణం’’ పట్ల ప్రజల్లో అవగాహన, క్రియా శీలతను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ‘‘పర్యావరణ సంరక్షణ్‌’’ (‌పర్యావరణ పరిరక్షణ) కార్యక్రమం ప్రారంభమైనది. స్వయంసేవలు ఈ పనులన్నింటినీ ‘గతివిధి’ పేరుతో సమాజం ముందుంచి ఆరంభిం చారు. సంఘ్‌ ‌కార్యకలాపాల అభివృద్ది యాత్ర మూడవ దశలో ఇది ఒక భాగం.

ప్రస్తుతం సంఘ్‌ ‌కార్యకలాపాల అభివృద్ధి యాత్ర నాల్గవ దశ సాగుతున్నది. దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తగా పనిచేస్తాడు. అందువల్ల ప్రతి ఉద్యోగి స్వయంసేవక్‌ ‌సామాజిక మార్పు కోసం తన ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా రంగంలో సామాజిక పరివర్తన, మార్పు కోసం చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించ డమైనది. సంఘ్‌ ‌వ్యవస్థాపకుడు డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ 1940‌లో జరిగిన శిక్షావర్గలో ప్రసంగిస్తూ సంఘ్‌ ‌కార్యకలాపాలను శాఖకు మాత్రమే పరిమితం చేయకుండా వాటిని సమాజంలోనూ చేయాలని అన్నారు. మీ కుటుంబానికి అవశ్యమైన ధనార్జన, కుటుంబం పట్ల శ్రద్ధ, క్రమం తప్పకుండా శాఖకు వెళ్లడంతో సరిపోదు. సమాజ పరివర్తన, జాగృతికి ఉపకరించే ఏ పనిలోనైనా మీ సమయాన్ని వెచ్చించి చురుకుగా పాల్గొనడమే సంఘ్‌ ‌కార్యం అవుతుంది. సమాజంలో సంఘ్‌ ‌కార్యకలాపాలను సమర్థవంత మైన పద్ధతిలో చేయడం ద్వారా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అఖిల భారతీయ దృక్పథాన్ని సాధించి ఆసేతు హిమాచల పర్యంతం సమాజం అంతా ఒక్కటే అనే భావనను అనుభవంలోకి తెచ్చుకోవాలి. సమాజాన్ని కూడా తీసుకువెళుతూ స్వార్ధాన్ని వదిలివేస్తూ సమాజానికి నేతృత్వం వహించే అంశాలను నేర్చుకుంటూ, వాటిని క్రమం తప్పకుండా సాధన చేస్తూ, శాఖకు సక్రమంగా వెళుతూ, శాఖ నుంచి నేర్చుకున్న ఈ అన్ని గుణాలను ప్రయోగిస్తూ, సమాజంలో పరివర్తన తీసుకురావడానికి ఏదో ఒక రంగంలో చురుకుగా పాల్గొనడం అత్యంత అవసరం. దీనితో పాటుగా స్వయంసేవకులకు సమాజంతో సంబంధం వృద్ధి చెందాలి. తద్వారా సమాజంలో నవతరం ప్రతినిధులు స్వయంసేవక్‌ ‌ద్వారా సంఘ్‌తో సంబంధాలు ఏర్పరుచుకుంటారు. సంఘ్‌ ‌గురించి తెలుసుకుంటారు. సంఘ్‌ ‌జాతీయ భావజాలాన్ని తెలుసుకుంటారు. సమాజంలో అంతర్భాగమైన హిందూధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజాన్ని సంరక్షిస్తారు. ఈ దేశ సర్వతో ముఖాభివృద్ధి కోసం సన్నద్ధమవుతారు.

సంఘటన, వ్యక్తి నిర్మాణ కార్యక్రమం కొనసాగు తూనే ఉంటుంది. సమాజాన్ని మేల్కొలిపే కార్యక్రమం (జాగరణ్‌ ‌శ్రేణి) సైతం తోడుగా కొనసాగుతుంది. వ్యవస్థ పరివర్తనను దృష్టిలో ఉంచుకొని సమాజ జీవనంలోని వివిధ రంగాల్లో వివిధ సంస్థల ద్వారా స్వయంసేవక్‌ ‌చురుకుగా వ్యవహరించాలి. ప్రస్తుతం ప్రతి ఒక్క స్వయంసేవక్‌ ‌సమాజ పరివర్తన పక్రియలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలి. వీటన్నింటి ద్వారా సంఘ్‌ ‌కార్యాచరణ దిశగా ముందుకు సాగుతూ సంఘ్‌ ‌కార్యాన్ని సంపూర్ణత వైపుకు తీసుకువెళ్లడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది.

అను: వేదుల నరసింహం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram