Tag: Corona virus

కరోనా కల్లోలంలోనూ చైనా కుత్సిత రాజకీయాలు

– డా।। రామహరిత చైనా కరోనా వైరస్‌ ‌వల్ల ప్రపంచమంతా యుద్ధం వంటి సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయుధరహిత యుద్ధంగా విశ్లేషకులు చెప్తున్న ఈ మహమ్మారి పంపిణీ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. ఎంతో మానవ, ఆర్థిక నష్టాన్ని తెచ్చింది. ఈ ప్రమాదకర వైరస్‌ను అదుపుచేయడంలో పూర్తిగా విఫలమైన చైనా అధికారిక సమాచార ఏజెన్సీల ద్వారా తన తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంతోపాటు దౌత్య మార్గంలో ప్రపంచ శక్తిగా మరోసారి గుర్తింపు సాధించాలనుకుంది. చైనా తెచ్చిన ఈ ఆయుధరహిత యుద్ధం ఆ దేశపు విస్తరణవాద విధానం వంటిదే. గుట్టుచప్పుడు కాకుండా భూభాగాలను ఆక్రమించడం, ఆర్థిక వ్యవస్థలను చేజిక్కించుకోవడం వంటి విధానాన్ని చైనా ఎప్పుడు అనుసరిస్తూనే ఉంది. ప్రపంచం దృష్టి తన చర్యలపై పడకుండా ఉండటానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవడం కూడా చైనాకు వెన్నతోపెట్టిన విద్య. తమ పౌరులకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేయడం కోసం ప్రత్యేక సామాజిక మాధ్యమ ప్లాట్‌ ‌ఫామ్‌లు రూపొందించుకోవడం, ప్రత్యేక సెర్చ్ ఇం‌జన్లు వాడుకలోకి తేవడం చైనాకు అలవాటు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ‘చైనా అనుకూల వాతావరణం’ రూపొందించడం కోసం వివిధ దేశాల్లో తమ రాయబార కార్యాలయాల ద్వారాట్విట్టర్‌ ఉద్యమం నడుపుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచం చైనా చేస్తున్న ఈ గారడీలను తెలుసుకుంటోంది. అయినా చైనా తన ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. చైనా తమ అనుకూల మేధావి వర్గాన్ని ఎలా తయారుచేసుకుంటోంది, వారి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ అనుకూల ప్రచారం ఎలా చేసుకుంటోందన్నది విశ్లేషకులకు ఆసక్తికరమైన అధ్యయన విషయం అయింది. ప్రపంచమంతా చైనా కరోనా వైరస్‌తో సతమతమవుతుంటే చైనా నిరంకుశ ప్రభుత్వం తాము వైరస్‌పై ఎలా విజయం సాధించినదీ, ఎలా ప్రజలపై ఆంక్షలు ఎత్తివేసినది పత్రికల ద్వారా ప్రచారం ప్రారంభించింది.…

మతానికి వక్రభాష్యం ఫలితం

దేశ రాజధాని పరిసరాలలో తబ్లిఘి జమాత్‌ అనే సంస్థ నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌లో వేల మందిని పోగుచేసి ప్రార్థనలు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది? ఇప్పుడు చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు. నాతో సహా చాలా టీవీ చానళ్ల పేనలిస్టులకు ఇదే ప్రశ్న ఎదురైంది. జాతీయ మీడియాలో ఒక వర్గమైతే ఇంకొక అడుగు ముందుకేసి ‘కేంద్రం నిద్రపోతోందా?’ అని కూడా నిలదీస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఎందుకు బాధ్యత వహించాలంటే, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పోలీసు శాఖ ఉండదు కాబట్టి అంటున్నారు. వాస్తవంగా, కేంద్రం బాధ్యత వహించింది కాబట్టే, మర్కజ్‌ ‌నిర్వాహకుల మెడలు వంచింది కాబట్టే ఒక పెను విపత్తు నుంచి భారతదేశం బయటపడింది. దీనిని ఈ దేశ పౌరులంతా గుర్తించవలసిన అవసరం ఉందని నా విన్నపం. ఆ విషయం వివరించే ముందు నేను మరొక ముఖ్య విన్నపం కూడా చేస్తున్నాను. నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌మత ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా కూడా వారి కుటుంబ సభ్యులు, వారితో సాన్నిహిత్యం ఉన్నవారు, ఏదో రకంగా పరస్పరం తాకిన వారు అంతా… మాతృసమానులు, పితృసమానులు.. సోదర సమానులు ఎల్లరు కూడా అల్లా వారసులుగా, స్వచ్ఛందంగా బయటకు రండి! కొవిడ్‌ 19…

Twitter
Instagram