గత కొద్దివారాలుగా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పలు కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీ (న్యూ డెమొక్రసీ), సీపీఐ (న్యూ డెమొక్రసీ – న్యూ లైన్‌), ‌వాటి అనుబంధ విద్యార్థి సంఘాలు ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఆర్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, మహిళా సంఘం ఐద్వా, అరుణో దయం కళాకారులు, పౌరహక్కులు, మానవ హక్కులు, భావవ్యక్తీరణ స్వేచ్ఛ, జీవించేహక్కు కోసం వాదించే వారు, అవిశ్రాంతంగా ప్రచారం కోరుకునే ఆందోళన జీవులు భారత సాయుధ దళాల కాల్పుల విరమణకు, చర్చలకు పీపుల్స్ ‌వార్‌ ‌గెరిల్లా ఆర్మీ – పీడబ్ల్యూజీఏ ఇచ్చిన పిలుపును భారత ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

యువకుడిగా ఉన్నప్పటి నుంచి 1962లో భారత్‌పై చైనా యుద్ధం వరకు నేనొక కమ్యూనిస్టును. యూఎస్‌ఎస్‌ఆర్‌ ‌కామిన్‌టెర్న్ / ‌కామిన్‌ఫోమ్‌ ‌చీఫ్‌ ‌కామ్రేడ్‌ ‌జేవీ స్టాలిన్‌ ఆదేశానుసారం సెక్రటరీ జనరల్‌ ‌కామ్రేడ్‌ ‌బీటీ రణదివే నేతృత్వంలో భారత ప్రభుత్వంపై కమ్యూనిస్టులు జరిపిన యుద్ధం గురించి నాకు తెలుసు. యూఎస్‌ఎస్‌ఆర్‌ ‌పాలకుడు జేవీ స్టాలిన్‌ ‌సలహాతో 1948-51 మధ్యకాలంలో తెలంగాణలో భారత ప్రభుత్వంపై పోరాటానికి సీపీఐ ముగింపు పలికింది.అప్పట్లో ఆయన సలహాలు, సూచనల కోసమని కామ్రేడ్లు చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, ఎస్‌ఏ ‌డాంగే, అజయ్‌ ‌ఘోష్‌లతో కూడిన ఒక రహస్య బృందం మాస్కో వెళ్లింది. ఇప్పుడైతే భారత ప్రభుత్వం చర్చల కోసమని కమ్యూ నిస్టులు ఇచ్చిన పిలుపును పెడచెవినపెడుతోందని పీడబ్ల్యూజీఏ, క్షేత్రస్థాయిలోని వారి మార్క్సిస్ట్- ‌కమ్యూనిస్ట్-‌మావోయిస్ట్-‌తోటి ప్రయాణి కులు విమర్శి స్తున్నారు కానీ 1951లో గెరిల్లా యుద్ధం చేస్తున్న సీపీఐ చర్చలకు పిలుపునివ్వడమే కాకుండా మిగిలిన కొద్ది మంది కమ్యూనిస్టు గెరిల్లాలు ఆయుధాలను వదిలివేసి, వారంతటా వారుగా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్‌ ఎన్‌.ఎం.‌జయసూర్య 1951-52 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్‌ ‌రాష్ట్ర అసెంబ్లీకి, ఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఆ తర్వాత చరిత్రను తిరగేస్తే సీపీఐ రెండు ముక్కలుగా చీలిపోయింది. ఆ రెండు ముక్కలు కాస్త మరిన్ని పేలికలుగా చీలిపోయాయి. చివరకు తమలో ప్రజాదరణ కలిగిన రెండు శాతం నేతల నేతృత్వంలో అవ్వన్నీ కూడా ‘ప్రకటన’, ‘లెటర్‌-‌హెడ్‌’ ‌పార్టీలుగా పనిచేస్తున్నాయి. చరిత్రాత్మక సీపీఐ పేరును దక్కించుకున్న వర్గం కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రాపకం కోసమని వెంపర్లాడుతోంది. దానికి కాంగ్రెస్‌ ‌సోషలిస్టు పార్టీ తరహాలో కాంగ్రెస్‌ ‌కమ్యూనిస్టు పార్టీ అనే పేరు సరిగ్గా సరిపోతుంది. కాంగ్రెస్‌ ‌సోషలిస్టు పార్టీ పేరుతో కాంగ్రెస్‌లో చొరబడిన ఆచార్య నరేంద్ర దేవ్‌, ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌, అచ్యుత్‌ ‌పట్వర్థన్‌, ‌రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా తదితర సోషలిస్టులు ఈ వర్గానికి నేతృత్వం వహించారు. 1932లో అరెస్టయి, 1945లో విడుదలైన ఈ నేతలను కాంగ్రెస్‌ ‌పార్టీ తర్వాత  బహిష్కరించింది.

కాంగ్రెస్‌ ‌పార్టీ తాను సోషలిజం, సెక్యూల రిజమ్‌, ‌ముస్లిములు, పేదల రక్షకురాలిని అనే ముద్రను పొందడానికి తహతహలాడిపోతోంది. కాబట్టి ఆ పార్టీకి సీపీఐతో సావాసం చేయడం సంతోషమని పించింది. నిజానికి ఇందిరాగాంధీ అత్యయిక పాలనను(1975-77) సీపీఐ సమర్థించింది. పేరొం దిన సీపీఐ నేత కామ్రేడ్‌ ‌మోహన్‌ ‌కుమార్‌ ‌మంగళం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. బ్యాంకుల జాతీయీకరణ లాంటి ‘సోషలిస్టు’ కార్యక్రమాలను అమలు చేశారు. ప్రజాదరణ పొందిన పార్టీలోకి చొరబడి వాటిని విభజించడం లేదా నియంత్రించడం అనేది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలకు ఓ రివాజుగా మారింది. వీఐ లెనిన్‌ ‌తన భావ జాలంతో కూడా ప్రయాణించే వారిని ‘యూజ్‌ఫుల్‌ ఇడియట్స్’- ‌పనికొచ్చే బుద్ధిహీనులు అని పిలిచేవారు.

భారత్‌లోని పశ్చిమబెంగాల్‌, ‌త్రిపుర రాష్ట్రాలను 34 ఏళ్లు ఏలిన కమ్యూనిస్టుల కథ ముగిసిపోయింది. ప్రస్తుతం వారి ఏలుబడిలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. కమ్యూనిస్టు గొడుగు కింద వేర్వేరు పేర్లతో తలదాచు కుంటున్న పార్టీలు తరచుగా ప్రకటనలు జారీ చేస్తుంటాయి. వాటన్నింటినీ మావోయిస్టు పీడబ్ల్యూజీఏ నిరసించింది. అది గడచిన యాభై ఏళ్లుగా దండ కారణ్యంలో తన స్థావరాల నుంచి భారత ప్రభు త్వంపై యుద్ధం చేస్తోంది. అది ముఖ్యమంత్రులుగా ఎన్టీరామారావు, వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి హయాంలో కూడా కాల్పుల విరమణ కోసమని చర్చలు జరపాలని డిమాండ్‌ ‌చేసింది. వీరిద్దరూ చర్చలు మొదలు కావడానికి ముందు పీడబ్ల్యూజీఏ ఆయుధాలు అప్పగించాలని పట్టుబట్టారు. కానీ అందుకు పీడబ్ల్యూజీఏ నిరాకరించింది. ఇప్పుడు కూడా పీడబ్ల్యూజీఏ, దానికి మద్దతు ఇచ్చే మూకలు, దాని కూడా ప్రయాణించే యూజ్‌ఫుల్‌ ఇడియట్స్ ఆయుధాలు అప్పగించకుండానే కాల్పుల విరమణను, చర్చలను అడుగుతున్నారు. వారు భారత సాయుధ దళాల చేతిలో సామూహికంగా హతమైపోతారు. వారు ఎవరినైతే ఇన్‌ఫార్మర్లుగా అనుమానిస్తున్నారో వారిపై ‘ప్రజాశత్రువులు’ అనే ముద్రవేసి పొట్టన పెట్టుకుంటారు. కొందరైతే లొంగిపోవడం ద్వారా చేతికి సరిపడా పునరావాస ప్యాకేజీని అందుకుంటు న్నారు. 2026నాటికి మావోయిస్టు పీడబ్ల్యూజీఏను తుడిచిపెట్టేస్తామని భారత ప్రభుత్వం ప్రతిన బూనింది. దివంగత ఎన్టీరామారావు పీడబ్ల్యూజీఏ ఆయుధ జీవులను ‘దారితప్పిన దేశభక్తులు’ అని పిలిచేవారు. చూడబోతే 1948-51 మధ్యకాలంలో లాగా వీరంతా ఎవరికివారే అన్నట్టుగా కనుమరుగై పోతారు. ప్రపంచ చరిత్రలో సుదీర్ఘమైన అంతర్యుద్ధం అపకీర్తిని మూటగట్టుకొని మరీ ముగిసిపోతుంది. కాకపోతే దాని ప్రజాగాయకులు (గద్దర్‌, ఆయన కుమార్తె లాంటి వారు) ఇండో- ఇటాలియన్‌ ‌తల్లీ కుమారుడూ కుమార్తెల నేతృత్వంలో (సొంతమైన?) సోషలిజాన్ని చిలకరిస్తూ, ‘గరీబీ హటావో’ (పేదరికాన్ని నిర్మూలించాలి) నినాదంతో ప్రజలను నమ్మబలికిన కాంగ్రెస్‌ ‌పార్టీలో కాస్త నీడను సంపాదించుకోవచ్చు.

 దారితప్పిన వేలాది మంది దేశభక్తుల ‘ఆత్మలకు శాంతి’ కలగాలి.

 త్రిపురనేని హనుమాన్‌ ‌చౌదరి

ఛైర్మన్‌, ‌ప్రజ్ఞాభారతి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE