ఒకప్పుడు మావోయిస్టు ఉగ్రవాదంతో దెబ్బతిన్న ఛత్తీస్‌గఢ్‌ కొత్త పారిశ్రామిక విధానం ద్వారా గణనీయమైన పరివర్తన చెందుతోంది. నూతన పారిశ్రామిక విధానం ద్వారా రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ డేటా పార్కుల నుంచి సెమీకండక్టర్‌ యూనిట్ల వరకు రాష్ట్రం ఉత్పాదకత, ఆవిష్కరణలకు ఒక శక్తి కేంద్రంగా ఆవిర్భవిస్తోంది.

ఒకప్పుడు మావోయిస్టు టెర్రరిజం, నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్లకు పర్యాయపదంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రస్తుతం పారిశ్రామికాభివృద్ధి, ఆవిష్కరణలకు  కేంద్రంగా అభివృద్ధి చెందుతూ తన చరిత్రను సొంతంగా రాసుకుంటోంది. నవంబర్‌ 1, 2024 నుంచి అమలులోకి వచ్చిన పరివర్తనాత్మక పారిశ్రామిక అభివృద్ధి విధానం రాష్ట్రానికి రూ.4.5 కోట్ల లక్షల విలువైన పెట్టుబడులను తీసుకురావడంలో ఒక ఉత్ప్రేరకంగా నిలిచింది. రాష్ట్రాన్ని ఉత్పాదకత, సాంకేతికత, సేవల రంగంలో అభివృద్ధి చెందుతున్న శక్తి కేంద్రంగా నిలిపింది. ఓ వైపు భద్రతా దళాలు నక్సలిజాన్ని అరికట్టడానికి ప్రయత్నాలను ముమ్మరం  చేస్తున్నప్పటికీ, మరో వైపు వ్యూహాత్మక సంస్కరణలు, వ్యాపార సౌలభ్యతపై దృష్టి చోదకంగా చోటుచేసు కుంటున్న ఈ మార్పు ఛత్తీస్‌గఢ్‌ ఆర్థిక యవనికను పునర్నిర్వచిస్తోంది.

సరికొత్త పారిశ్రామిక వేకువ

ఛత్తీస్‌గఢ్‌ పారిశ్రామిక పునరుజ్జీవనం మైలురాళ్లు అనదగ్గ రెండు పరిణామాల ద్వారా గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి మే నెల మొదట్లో  దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌`ఏఐ ఆధారిత డేటా సెంటర్‌కు నవ రాయ్‌పూర్‌లో శంకుస్థాపన చేశారు. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ ఓ టెక్నాలజీ హబ్‌గా అవతరించడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. అంతకు మునుపు ఏప్రిల్‌ మాసంలో రాష్ట్రంలో మొట్టమొదటి గల్లియమ్‌ నైట్రైడ్‌ (జీఏఎన్‌) ఆధారిత  సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ను ప్రారంభించారు. చెన్నయ్‌ కేంద్రంగా పనిచేస్తున్న పోలిమాటెక్‌ రూ.1,143 కోట్లతో ఈ యూనిట్‌ను నెలకొల్పింది. ఇందులో అదనంగా రూ.10 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టడానికి ప్రణాళికలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌కు ఇప్పటిదాకా బొగ్గు, ఇనుము, బాక్సైట్‌ అనేవి సంప్రదాయబద్ధమైన బలాలుగా ఉంటున్నాయి. కొత్తగా వచ్చిన ఈ రెండు ప్రాజెక్టులు మార్పు దిశగా ఛత్తీస్‌గఢ్‌ ఆకాంక్షను నెరవేరుస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ ` బీజేపీ 2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యమైన  రాష్ట్ర నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం వీటికి సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన పాత్రను పోషించింది. ఈ విధానం అమలు చేసిన ఆరు నెలల్లోనే రూ.4.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదిరాయి. ఇది 2023`2024 సంవత్సరానికి  ఛత్తీస్‌గఢ్‌ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ` జీఎస్‌డీపీ రూ.5.09 లక్షల కోట్లకు దరిదాపుల్లో ఉంది. ఈ పెట్టుబడులు సాకారమైన పక్షంలో అవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేయ గలవు. ఇంకా చెప్పాలంటే, రాష్ట్రంలోకి మూలధన ప్రవాహం గణనీయమైన ఆర్థిక పురోగతిని సూచిస్తోంది.

ఓ వైపు ఛత్తీస్‌గఢ్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులు విసురుతున్న సవాల్‌ను సమర్థ మంతంగా ఎదుర్కుంటోంది. మే నెల మొదట్లో తెలంగాణ సరిహద్దుకు సమీపంలో వారాలపాటు జరిగిన నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌లో 31 మృత దేహాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. మార్చి 31, 2026 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తా మని కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా ఇచ్చిన హామీకి అనుగుణంగా  మే 21న నారాయణపూర్‌లో అదనంగా 27 మంది మావోయిస్టులను హత మార్చారు.

ఛత్తీస్‌గఢ్‌ పరిశ్రమల మంత్రి లఖన్‌ లాల్‌ దేవాన్‌గన్‌ మీడియాతో మాట్లాడుతూ ఓ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం చూడ్డానికి ఇలాగే ఉంటుంది అని అన్నారు. కేంద్రం భద్రతను చూసుకుంటోంది. మేము రాష్ట్ర స్థాయిలో అభివృద్ధిని నడిపిస్తున్నాం అని ఆయన తెలిపారు. భద్రత, ఆర్థిక పురోగతితో కూడిన ఈ ద్వంద్వ దృష్టి ఛత్తీస్‌గఢ్‌కు సంఘర్షణతో నిండిన ప్రాంతంగా తనపై పడిన మచ్చను చెరిపేసుకోని పెట్టుబడులకు అనుకూలమైన ఒక గమ్యస్థానంగా తనను తాను నిరూపించుకోవడానికి వీలు కల్పించింది.

విధాన రూపకల్పన

పారిశ్రామిక అభివృద్ధి విధానం ఒక కచ్చితమైన ప్రణాళిక నుంచి పురుడు పోసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి సాయి ఛత్తీస్‌గఢ్‌ అనుకూల తలు, ప్రతికూలతలకు తగ్గట్టుగా ఒక విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పారిశ్రామిక సంఘాలను సంప్రదించింది. పొరుగు రాష్ట్రాల విధానాలను సమీక్షించింది. ఒక సమగమ్రైన విధానాన్ని నిర్ధారించడానికి శాఖల వారీగా అధికారులను రంగంలోకి దించింది. ఇదే విషయమై ప్రజా సంబంధాల కమిషనర్‌ రవి మిట్టల్‌ మాట్లాడుతూ ఇనుము, బొగ్గు, బాక్సైట్‌లో మా సామర్థ్యాన్ని వినియోగించుకుంటూనే నవశకపు పరిశ్రమలలోకి విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాం   అన్నారు.

ఈ విధానం ఉక్కు, సిమెంట్‌ వంటి కీలకమైన రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఫార్మా, టెక్స్‌టైల్స్‌, ఆగ్రో` ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఏఐ, రోబోటిక్స్‌, ఐటీ, డేటా సెంటర్లు వంటి రంగాలకూ ఊతమి స్తోంది. ఈ రంగాల్లో శైశవ దశలో ఉన్న పరిశ్రమలు వృద్ధి చెందడానికని మెరుగైన ప్రోత్సాహకాలను అందుకుంటున్నాయి.

ఇదే విషయమై రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి డిప్యూటీ డైరెక్టర్‌ కేకే శ్రీవాస్తవ మాట్లాడుతూ ఉపాధి కల్పన ప్రత్యేకించి సేవల రంగంలో విధానం దృష్టిని ప్రధానంగా ప్రస్తావించారు. సేవల రంగానికి ఉద్యోగాలను సృష్టించడంలో అపారమైన సామర్థ్యం ఉన్నదనే విషయాన్ని తాము గుర్తించినట్టు తెలిపారు.

కొత్త విధానం సింగిల్‌ విండో క్లియరెన్స్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 34 పారిశ్రామిక పార్కులను నెలకొల్పింది. జాంజ్‌గిర్‌`చంపాలో ఒక ఫార్మాస్యూటికల్‌ పార్క్‌, స్మార్ట్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ సహా మరో నాలుగు పార్కులు ప్రణాళిక దశలో ఉన్నాయి.

అవగాహన ఒప్పందాల కార్యాచరణ

గతంలో అవగాహన ఒప్పందాలు ఎప్పటికీ కార్యరూపం దాల్చకుండా కాగితాలకే పరిమితమై పోయేవి. కానీ కొత్త విధానం పెట్టుబడికి ఆహ్వానాలు`ఐటీఎల్‌ఎస్‌ ద్వారా ఆచరణీయ ఫలితాలకు మార్గం సుగమం చేస్తోంది. పెట్టుబడి దారులతో సమగ్రంగా సంప్రదింపులు జరిపిన తర్వాతనే స్పష్టత, నిబద్ధతను సంతరించుకున్న ఐటీఎల్‌ఎస్‌ రూపుదిద్దుకుందని మంత్రి దేవాన్‌గన్‌ తెలిపారు.

ఈ విధానం ప్రాజెక్టు కాలక్రమాలను వేగవంతం చేసింది. ఉదాహరణకు పాలీమాటెక్‌కు చెందిన సెమీకండక్టర్‌ యూనిట్‌ కేవలం మూడు నెలల్లోనే ప్రతిపాదన నుంచి పునాది రాయి వేసే దశకు చేరుకుంది. అదేవిధంగా, రాక్‌బ్యాంక్‌ డేటాసెంటర్స్‌ నిర్వహిస్తున్న ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ పార్క్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 ఉద్యోగాలను సృష్టించడానికి సమాయత్తమవుతోంది. దీనికి మరింత ఊతమిస్తున్నట్టుగా రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ ` బీయీఎంఎల్‌  హెవీ ఎర్త్‌ మూవింగ్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికని జాంజ్‌గిర్‌`చంపాలో ఎకరానికి రూ.1 టోకెన్‌ రేటుకు 100 ఎకరాలను కొనుగోలు చేసింది. ఇది మేక్‌ ఇన్‌ ఇండియాతో ముడిపడి ఉంటుంది. ఉపాధి కల్పనకు, పారిశ్రామి కాభివృద్ధికి దోహదపడుతుంది. అదే విధంగా నవ రాయ్‌పూర్‌, మంగేలీలో యష్‌ ఫ్యాన్‌ అండ్‌ అప్లయన్సెస్‌, ఆదిత్య బిర్లా రెన్యూవబుల్స్‌కు భూమి కేటాయించారు.

పర్యాటకానికి పరిశ్రమ హోదా

ఛత్తీస్‌గఢ్‌ ప్రస్తుతం టెక్స్‌టైల్స్‌, ఐటీ, ఐటీ`ఆధారిత సేవలను(ఐటీయీఎస్‌) లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్‌ మాసంలో ముఖ్యమంత్రి సాయి టెక్స్‌టైల్‌ పరిశ్రమలను ఆకర్షించడానికని భారత దుస్తుల తయారీ సంఘం`సీఎంఏఐతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి నవరాయ్‌పూర్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ జాతీయ సంస్థ` ఎన్‌ఐఎఫ్‌టీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అయినప్పటికీ పెట్టుబడుల ప్రతిపాదనలు అంత ప్రోత్సాహకరంగా లేవు. దీంతో టెక్స్‌టైల్‌ రంగంలో స్థిర మూలధన పెట్టుబడిపై ప్రోత్సాహకాలను 100 శాతం నుంచి 200 శాతానికి పెంచుతూ విధానాన్ని సవరించారు. దీనికి తోడు బొమ్మల తయారీ, గ్రాఫేన్‌, హైటెక్‌ వ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్‌, ఆయుర్వేద ఔషధాలు వంటి కొత్త రంగాలకు విధానాన్ని వర్తింపజేశారు. రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలు ప్రత్యేక ప్యాకేజీలను అందుకుంటాయి. బస్తర్‌, సర్గుజాలో హోటళ్లు, రిసార్ట్‌లపై పెట్టుబడుల విధి విధానాల సడలింపుతో పర్యాటకం పరిశ్రమ హోదాకు ఎదిగింది.

ఇంధన రంగానికి అగ్రతాంబూలం

రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలలో ఇంధన రంగానికి రూ.3 లక్షల కోట్లు, థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు రూ.1 లక్ష కోట్లు వాటా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు) రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతాయి. రూ.48 వేల కోట్లతో అదానీ పవర్‌ ప్రైవేట్‌ పెట్టుబడులకు నాయకత్వం వహిస్తోంది. జిందాల్‌ పవర్‌ ఎన్‌టీపీసీ గ్రీన్‌తో కలిసి రాయగఢ్‌లో రూ. 12,800 కోట్ల పెట్టుబడితో 1,600 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌, రూ. 10 వేల కోట్ల పెట్టుబడితో 2,500 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నెలకొల్పాలనే ఆలోచనలో ఉంది.

సానుకూలతలు, సవాళ్లు

ఈ విధానం విజయవంతమైనప్పటికీ ప్రతిపాదన లకు కార్యరూపం ఇవ్వడంలో సవాళ్లను ఎదుర్కుం టోంది. ఇది పెద్ద ఎత్తున పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టినప్పుడు సర్వసాధారణంగా ఏర్పడే ఒక అవరోధం మాత్రమే. అయితే అందర్నీ కలుపుకొని పోవడం, దూసుకుపోయే తత్త్వాన్ని పరిశ్రమల శాఖ కలిగి ఉండడం ఒక సానుకూలమైన అంశం. తాజా విధానం ఇప్పటికే కార్యకలాపాలను సాగిస్తున్న పరిశ్రమలకు, కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమల మధ్య ఒక సమతూకాన్ని పాటిస్తుండటం ఒక స్వాగతించాల్సిన పరిణామం.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE