‘మనకు ఏమి కావాలో తెలిస్తే మన రైతులు ఏమి పండిరచాలో అర్థమవుతురది.’ అని అమెరికాలో పేరు ప్రఖ్యాతులు గడిరచిన భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త ఇటీవల అన్న మాటలు మన రాజకీయాలకూ వర్తిస్తాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 17 సంవత్సరాల పిదప కూడా మన రాజకీయ పక్షాలు ఒక లక్ష్యర లేకుండా సాగుతున్నాయని స్వర్గీయ దీనదయాళ్ ఉపాధ్యాయ 1961,62 ప్రాంతంలోనే ఆందోళన చెరదారు. దేశ ప్రజలను నడిపిరచాల్సిన రాజకీయ పక్షాలకు స్పష్టమైన దిశ కరవైరదన్న ఆయన అరతరంగ మథనంలోనురడే ఏకాత్మ మానవతా దర్శనం ఆవిర్భవించింది. ఆపైన ఐదున్నర దశాబ్దాలు గడచినా కూడా భారత రాజకీయాల్లో విపక్షాల వైఖరిలో మార్పు లేదు.
ఆరోజుల్లో కారగ్రెస్ను ఓడించాలన్నదే తప్ప మరేదీ కనిపించేది కాదు. ఉమ్మడి కూటమిగా మన ఆర్థిక విధానం ఏమిటి? మన విదేశాంగ విధానం ఏమిటి? ఇలాంటి అంశాలన్నింటినీ మనం స్థూలంగా అనుకోవాలి కదా! అంటే అటు పక్కా మార్క్సిజం నుండి ఇటు పూర్తి పెట్టుబడిదారీ వ్యవస్థ వరకు ఏదైనా సరే! మేము ఎవరిని సమర్థించడానికైనా సిద్ధమే అని సమాధానం వచ్చేది. కమ్యూనిస్టుల సహకారం తీసుకుని, అందరినీ కలుపుకుని ఎలాగైనా సరే కాంగ్రెస్ను ఓడిరచాలి అని అప్పుడు ప్రకటించే వారు. ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలోకి బిజెపి, మోదీ వచ్చాయి తప్ప విపక్షాల వైఖరిలో మార్పేమీ లేదు. అధికార పీఠాలను అందుకోడానికి ఎవరు ఎవరితో కలవడానికైనా సిద్ధపడడం మినహా దేశ ప్రజలకు స్పష్టమైన దిశా నిర్దేశనం చేయాలని గాని, గమ్యాన్ని నిర్దేశించాలని గాని ఎవరూ ఆలోచించడం లేదు. ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, ఫెడరల్ వ్యవస్థ వంటి పడికట్టు పదాలను వల్లెవేస్తున్నారు తప్ప ఆయా భావనల వెనుక గల భారతీయ దృక్పథం, తాత్వికతల ఆలోచన, ఆచరణ మచ్చుకైనా కనిపించడం లేదు.
రాజ్యాంగ రచనను ఇంచుమించు ఒంటిచేత్తో పూర్తి చేసిన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా ‘మన రాజ్యాంగంలోని గణతంత్ర, ప్రజాస్వామిక భావనలు పాశ్చాత్య దేశాలనుండి దిగుమతి చేసుకున్నవి కావు, భారతీయ సంస్కృతి, తాత్విక దృక్పథం నుండి వాటిని గ్రహించాను’ అని చెప్పారు. ప్రజాస్వామ్యానికి చాంపియన్లం అని చెప్పుకునే పశ్చిమ దేశాల్లో సైతం తొలుత మహిళలకు ఓటు హక్కు లేదు. భారత్లో ప్రజాస్వామ్యంతో పాటే కుల, మత, లిరగ విచక్షణ లేకుండా సార్వజనిక ఓటు హక్కు ఆమోదం పొందింది. రాచరిక వ్యవస్థనురడి వెలికి వచ్చే క్రమంలో పాశ్చాత్యులు గ్రీకుల గణరాజ్య సంస్కృతి నుండి ప్రజాస్వామిక భావనలను స్వీకరించారు.
మన సామాజిక రాజకీయ వ్యవస్థలో రాజు, రాజ్యం సర్వోన్నతం అనిఎన్నడూ అనుకోలేదు. సామాజిక జీవనంలో తోడ్పాటుకు, నియంత్రణకు ముఖ్యమైన సంస్థలు ఇంకా ఉండేవి. మనం పంచాయితీ, జనపద సభలను ఏర్పరచుకున్నాం. అత్యంత శక్తివంతుడైన రాజు కూడా ఎన్నడూ పంచాయతీలను కదల్చలేదు. వాటి స్వయం ప్రతిపత్తి గుర్తింపు పొందింది. మన గ్రామ పంచాయతీలు ఢిల్లీ పీఠాన్ని కూడా నిర్లక్ష్ం చేసేంత బలంగా ఉండేవని, స్వర్గీయ అంబేడ్కర్ చెప్పారు. స్వతంత్ర భారతావనిలో గణతంత్ర వ్యవస్థను ఆమోదించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ జనవరి 26కు ఏడు దశాబ్దాలు కావస్తున్నా, స్థానిక సంస్థలను బలోపేతం చేసే రాజ్యాంగ సవరణలను సైతం చట్టబద్ధత లేని కమిటీలతో నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు సాగడం విషాదం!
గణతంత్ర భావనకు, ప్రజాస్వామిక దృక్పథానికి బద్ధశతృవైన కాంగ్రెస్ బాటలో పలు ప్రాంతీయ పార్టీలు నడుస్తున్నాయి. తమ వారసులకు అధికారం కట్టబెట్టాలనే తపనను కప్పి పుచ్చి, ఫెడరల్ వ్యవస్థ, ప్రజాస్వామిక విలువలు, దేశప్రయోజనాలు అని కల్లబొల్లి కబుర్లు వల్లిస్తున్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాల భావోద్వేగాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. భారతీయ విశిష్టతలో హిరదుత్వను కాపాడుకోవడం ఎరత ముఖ్యమో గణతంత్ర వ్యవస్థను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యర. అధికాం పిపాసుల స్వార్థానికి బలికాకుండా భారత ప్రజలు గణతంత్రాన్ని నిలుపుకోవాలి!